News January 27, 2025
సచివాలయాలపై సర్కారు కీలక నిర్ణయం

AP: గ్రామ సచివాలయాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉండే ఆవాస ప్రాంతాలను వాటి సమీప సచివాలయాల్లో చేర్చనుంది. జనాభా ప్రాతిపదికన సిబ్బందిని నియమించనుంది. ఈ మేరకు సచివాలయాల శాఖ పంపిన ప్రతిపాదనను ఆమోదించింది. ఇక సచివాలయాలన్నింటినీ నాలెడ్జ్ హబ్లుగా మార్చాలని సర్కారు నిర్ణయించింది. కృత్రిమ మేధ సాయంతో ప్రజల్ని MSME పారిశ్రామికవేత్తలుగా చేసే దిశగా శిక్షణ అందించనుంది.
Similar News
News January 2, 2026
AP, TG మధ్య ఉన్న జలవివాదాలు ఏంటి?

AP, TG జల <<18742119>>వివాదాలు<<>> దశాబ్దాలుగా ఉన్నాయి. TG విద్యుదుత్పత్తితో శ్రీశైలంలో తమ నీటి వాటా తగ్గుతోందని AP వాదిస్తోంది. నాగార్జునసాగర్ నుంచి AP ఎక్కువ నీటిని తీసుకుంటోందనేది TG అభ్యంతరం. KWDT-I అవార్డు ప్రకారం AP, TG వాటా 66:34 నిష్పత్తి కాగా తెలంగాణ 50% ఇవ్వాలంటోంది. పాలమూరును AP వ్యతిరేకిస్తోంది. పోలవరం-బనకచర్లకు TG ససేమిరా అంటుండగా గోదావరి మిగులు నీటిపై హక్కు తమదేనని AP వాదిస్తోంది. ఇలా అనేకమున్నాయి.
News January 2, 2026
గ్రోక్ ‘బికినీ’ ట్రెండ్.. మహిళా ఎంపీ ఆందోళన

ఏఐ చాట్బోట్ ‘గ్రోక్’ అసభ్యకర ట్రెండింగ్పై శివసేన(UBT) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ ఐటీ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్కు లేఖ రాశారు. మహిళల ఫొటోలను గ్రోక్ ద్వారా అశ్లీలంగా మార్ఫ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై చర్యలు చేపట్టాలని కోరారు. కాగా ‘X’ సీఈవో మస్క్ కూడా ‘బికినీ’ ట్రెండ్ను వైరల్ చేస్తుండటం గమనార్హం.
News January 2, 2026
INC, BRS హోరాహోరీ ‘ప్రిపేర్’ అయ్యాయి కానీ…

CM హోదాలో గతంలో KCR కృష్ణా జలాలపై చర్చ పెడితే ‘ప్రిపేర్’ కాలేదని అప్పటి విపక్ష నేత ఉత్తమ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై కేసీఆర్ సెటైర్లూ వేశారు. మళ్లీ ఇదే అంశం ఇప్పుడు చిచ్చు రేపగా INC, BRS హోరాహోరీ ప్రిపేరయ్యాయి. మంత్రి ఉత్తమ్ వారం నుంచీ ఇదే పనిలో ఉన్నారని CM చెప్పారు. తీరా అసెంబ్లీ ఆరంభం కాగా KCR రాలేదు. శాసనసభలో చర్చా లేదు. చివరకు ఇరుపార్టీల ప్రిపరేషన్ మొత్తం వృథా అయింది.


