News October 19, 2024
ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయి: జగన్
AP: కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలింది. విజయనగరం జిల్లా గుర్లలో ప్రబలిన అతిసార ఘటనలే దీనికి ఉదాహరణ. 11 మంది చనిపోయినా ప్రభుత్వం నిద్ర వీడడం లేదు. ఆస్పత్రులున్నా స్థానిక స్కూళ్లలో బెంచీల మీద చికిత్స అందించడం దారుణం. ఇప్పటికైనా డయేరియా బాధిత గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 19, 2024
ఛత్తీస్గఢ్లో ఐఈడీ బ్లాస్ట్.. ఇద్దరు జవాన్ల వీరమరణం
ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈరోజు ఉదయం స్థానిక ధుర్బేద ప్రాంతంలో కూంబింగ్ కోసం ఐటీబీపీ, జిల్లా రిజర్వు గార్డ్ బలగాలు వెళ్తున్న సమయంలో కొడ్లియార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఏపీలోని కడపకు చెందిన కె రాజేశ్ అనే జవాను ఉండటం గమనార్హం.
News October 19, 2024
లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్పై GST మినహాయింపులకు మంత్రులు OK
లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్లపై GSTకి మినహాయింపులు ఇవ్వడంపై మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. Sr సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.5లక్షల కవరేజీ వర్తించే హెల్త్ ఇన్సూరెన్స్కూ పూర్తి మినహాయింపు ఇవ్వడానికి అంగీకరించారని సమాచారం. టర్మ్ ఇన్సూరెన్స్పై ఎంత వరకు ఇస్తారో తెలియాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలపై రిపోర్టును OCT 31లోపు GST కౌన్సిల్కు ఇవ్వాలి. ఆ తర్వాత మీటింగ్లో ఫైనలైజ్ అవుతుంది.
News October 19, 2024
రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
AP: విశాఖ శారదా పీఠానికి ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే గత ప్రభుత్వంలో రూ.15 లక్షలకు శారదా పీఠానికి కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను రద్దు చేసింది. దీనిపై సోమవారం అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.