News August 23, 2024
మూగజీవాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం శోచనీయం: హరీశ్ రావు

TG: మూగజీవాల సంరక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని హరీశ్రావు విమర్శించారు. ‘ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని దుస్థితి ఉంది. 9 నెలలుగా మందులు లేక పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయి. 1962 పశువైద్య సంచార వాహనాల నిర్వహణను గాలికొదిలేశారు. వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరించాలి. 1962 వాహనాల్లో విధులు నిర్వర్తించే వారికి సకాలంలో జీతాలు ఇవ్వాలి’ అని CM రేవంత్ను డిమాండ్ చేశారు.
Similar News
News April 4, 2026
కరకట్టపై వెళ్తుంటే శ్మశానమే కనిపిస్తోంది: బొత్స

AP: అమరావతిలో కృష్ణా కరకట్టపై వెళ్తుంటే శ్మశానమే కనిపిస్తోందని YCP నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘అమరావతిపై GOVTది ప్రచారార్భాటమే. అక్కడి అవినీతికి తప్ప YCP దానికి వ్యతిరేకం కాదు. తీర్మానాలతో అమరావతి పర్మినెంట్ అయిపోయిందనుకుంటే పొరపాటే. దాన్ని శాసన రాజధానిగానే చూస్తాం. రెండేళ్లైనా నిర్మాణాలు పూర్తిచేయలేదు’ అని మండిపడ్డారు. అనేక సమస్యలుండగా అమరావతినే అభివృద్ధి చేస్తామంటే కుదరదన్నారు.
News April 4, 2026
సిమ్రాన్.. 50 ఏళ్ల వయసులోనూ ట్రెండీగా..

1990లలో తన అందం, అభినయంతో యువతను కట్టిపడేసిన సిమ్రాన్ ఇవాళ 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో మోడ్రన్ డ్రెస్సులో ట్రెండీగా కనిపించారు. 50 ఏళ్లు వచ్చినా లేటెస్ట్ స్టైల్తో అదుర్స్ అనిపించారు. సిమ్రాన్ తెలుగులో సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, కలిసుందాం రా, నువ్వు వస్తావని, డాడీ, సీతయ్య తదితర హిట్ సినిమాల్లో నటించారు.
News April 4, 2026
12 లక్షల కుటుంబాలకు సంతానం లేమి: మంత్రి

APలో 12 లక్షల కుటుంబాలు సంతాన వైఫల్యంతో ఇబ్బంది పడుతున్నాయని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. అలాంటి కుటుంబాలకు దేశంలోనే తొలిసారిగా సంతానోత్పత్తి వైద్య సేవల్ని ఉచితంగా అందిస్తామని తెలిపారు. శిశు సంరక్షణలో తల్లికే ప్రధాన బాధ్యత ఉంటోందని.. దీనిలో మార్పు రావాలన్నారు. మెటర్నటీ, పెటర్నిటీ లీవ్లతో పేరెంట్స్కు సమాన బాధ్యత ఉండేలా చూస్తామని చెప్పారు. శిశు, వృద్ధుల సేవలకు వీలుగా కోర్సులు తెస్తామన్నారు.


