News February 20, 2025
జగన్ భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. గవర్నర్కు వైసీపీ ఫిర్యాదు

AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో YCP నేతలు సమావేశమయ్యారు. నిన్న గుంటూరు మిర్చియార్డు పర్యటన సందర్భంగా మాజీ CM జగన్కు ప్రభుత్వం భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని తెలిపారు. జగన్ రక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. గవర్నర్ను కలిసిన వారిలో మండలి ప్రతిపక్ష నేత బొత్స, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు.
Similar News
News January 27, 2026
పద్మశ్రీ గ్రహీతపై కాంగ్రెస్ విమర్శలు.. శ్రీధర్ వెంబు కౌంటర్

పద్మశ్రీకి ఎంపికైన IIT మద్రాస్ డైరెక్టర్ ప్రొ.కామకోటిపై కేరళ కాంగ్రెస్ విమర్శలకు జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు కౌంటర్ ఇచ్చారు. ‘మైక్రో ప్రాసెసర్ డిజైన్పై కామకోటి పని చేస్తున్నారు. ఆయన అవార్డుకు అర్హులు. ఆవు పేడ, మూత్రంలో విలువైన మైక్రోబయోమ్లు ఉన్నాయి. ఇవి రీసెర్చ్కు పనికిరావనే బానిస మనస్తత్వం మనది’ అని విమర్శించారు. గోమూత్రాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారని కామకోటిని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.
News January 27, 2026
ప్రాధాన్యత వారీగా ప్రాజెక్టుల పూర్తి: CBN

AP: వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదే పూర్తి చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. ‘గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని కడపకు తీసుకెళ్లేలా చూడాలి. 10 జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా పూర్తిచేయాలి’ అని సూచించారు. DP వరల్డ్ సంస్థ(దుబాయ్) ఉద్యాన క్లస్టర్ ఏర్పాటు చేయనుందని తెలిపారు.
News January 27, 2026
EUతో డీల్.. తెలుగు స్టేట్స్కు లాభమేంటంటే?

భారత్-EU మధ్య ఫ్రీ <<18973548>>ట్రేడ్ డీల్<<>> జరిగిన విషయం తెలిసిందే. దీంతో యూరప్లోని 27 మార్కెట్లు మన ఆంత్రపెన్యూర్స్కు అందుబాటులోకి వచ్చాయి. ఓవరాల్గా 15 రంగాలకు సంబంధించిన ఎగుమతుల్లో రూ.6.4లక్షల కోట్ల వరకు అదనపు అవకాశాలు దక్కుతాయి. AP నుంచి సీ ఫుడ్, కెమికల్స్, ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్.. TG నుంచి టెక్స్టైల్స్, ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్ రంగాల ఉత్పత్తులకు లబ్ధి చేకూరనుంది.


