News February 20, 2025

జగన్ భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు

image

AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో YCP నేతలు సమావేశమయ్యారు. నిన్న గుంటూరు మిర్చియార్డు పర్యటన సందర్భంగా మాజీ CM జగన్‌కు ప్రభుత్వం భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని తెలిపారు. జగన్ రక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మండలి ప్రతిపక్ష నేత బొత్స, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు.

Similar News

News January 25, 2026

రిపబ్లిక్ డే.. 30వేల మంది పోలీసులు, 6 కంట్రోల్ రూమ్స్‌తో నిఘా

image

ఢిల్లీలో రేపు జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యల్లో 30 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలు పాల్గొంటున్నాయి. కర్తవ్యపథ్ వద్ద 6 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి నిఘా చర్యలు చేపట్టారు. 10 వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు పరేడ్‌కు హాజరవుతున్నారు. 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలు పరేడ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల శకటాలకు ఈసారి చోటు దక్కలేదు.

News January 25, 2026

టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధం: కోమటిరెడ్డి

image

TG: సింగరేణి టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టెండర్లలో స్కామ్ జరిగితే ఉపేక్షించబోమన్నారు. ‘కిషన్ రెడ్డి లేఖ రాస్తే దగ్గరుండి విచారణ చేయిస్తా. నా సోదరుల కంపెనీలతో నాకు సంబంధం లేదు. నాకు ఏ కంపెనీలో వాటా లేదు. డబ్బులే కావాలనుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎందుకు చెబుతా?. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే BRS దుష్ప్రచారం చేస్తోంది’ అని ఫైరయ్యారు.

News January 25, 2026

APPLY: టెన్త్ అర్హతతో 572 పోస్టులు

image

RBIలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో 36 పోస్టులున్నాయి. టెన్త్ పాసైన వారు అర్హులు. డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారికి అవకాశం లేదు. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: rbi.org.in