News February 18, 2025

యూనివర్సిటీలకు వీసీలను నియమించిన గవర్నర్

image

AP: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రా వర్సిటీకి జీపీ రాజశేఖర్, రాయలసీమ వర్సిటీకి వెంకట బసవరావు, పద్మావతి మహిళా వర్సిటీకి ఉమ, కృష్ణా వర్సిటీకి కే రాంజీ, అనంతపురం JNTUకు సుదర్శనరావు, కాకినాడ JNTUకు CSRK ప్రసాద్, నన్నయ వర్సిటీకి ప్రసన్న, యోగి వేమన వర్సిటీకి ప్రకాశ్ బాబును వీసీలుగా నియమించారు. వీరంతా మూడేళ్ల పాటు పదవుల్లో ఉంటారు.

Similar News

News January 19, 2026

వరిలో సుడిదోమ – నివారణకు కీలక సూచనలు

image

వరి కంకులు ఏర్పడే దశలో సుడిదోమ ఆశించడం వల్ల ఆకులు వాడిపోయి, మొక్క ఎదుగుదల ఉండదు. కంకులపై దాడి వల్ల కంకులు గోధుమ రంగులో, నల్లటి చీలిన గింజలతో కనిపిస్తాయి. ఫలితంగా పంట నాణ్యత దెబ్బతిని, దిగుబడి తగ్గుతుంది. సమస్య తీవ్రమైతే మొక్కలు చనిపోతాయి. సుడిదోమ నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 75 S.P 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్+ఎథిప్రోల్ 80 WG 0.25గ్రా. లేదా పైమెట్రోజైన్ 50 WG 0.6 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News January 19, 2026

మాఘమాసం ప్రారంభం.. ఇవి అలవరుచుకోండి!

image

మాఘమాసం అంటే పాపాలను హరించేది అని అర్థం. ఆధ్యాత్మిక చింతనకు ఇది ఎంతో శ్రేష్ఠమైన కాలమని పండితులు అంటున్నారు. ‘విష్ణువు, సూర్య భగవానుడు, శివుడికి ఈ నెల ఎంతో ముఖ్యమైనది. ఈ మాసంలో నదీ స్నానం చేస్తే పాపాలు హరిస్తాయి. పురాణ పఠనం, జపం, దానధర్మాలు, తర్పణం, హోమం చేయడం పుణ్యప్రదం. ముఖ్యంగా నువ్వులు, అన్నదానం, వస్త్రదానం చేయడం మంచిది. ఈ నెలలో మాఘ ఆదివారం నోము, మాఘ గౌరీ నోము చేస్తారు’ అని చెబుతున్నారు.

News January 19, 2026

పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన

image

AP: పోలవరం పనుల పురోగతిని విదేశీ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు ఆ బృందం పర్యటిస్తుంది. కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. ఇవాళ ప్రాజెక్టులో గ్యాప్ 1, D హిల్, G హిల్, మట్టి నిల్వల ప్రాంతాలను పరిశీలించనున్నారు. రేపు మెయిన్ డ్యామ్‌లో గ్యాప్ 2, మెటీరియల్ నిల్వలు, 21న స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్‌ను పరిశీలిస్తారు.