News July 31, 2024
ఏపీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు గవర్నర్ ఆమోదం

AP: ఏపీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. రూ.1,29,972 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. నవంబర్ 30 వరకు ఈ బడ్జెట్ అమలులో ఉంటుంది. ఇందులో అన్నక్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు సహా పలు అత్యవసర విభాగాలకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. కాగా గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నేటితో ముగిసింది.
Similar News
News April 8, 2026
US, ఇరాన్ వార్నింగ్స్.. గల్ఫ్ దేశాల్లో అలర్ట్!

US, ఇరాన్ పరస్పర హెచ్చరిక నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అలర్ట్ అయ్యాయి. 6 గంటలపాటు ఇళ్లలోనే ఉండాలని కువైట్ తమ దేశ ప్రజలకు సూచించింది. ఇక ప్రజలు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం కోరింది. అటు ఖతర్లో థ్రెట్ అలర్ట్ జారీ చేశారు. అధికారుల సూచనలు పాటించాలని అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. సౌదీ అరేబియాకు రావొద్దని, హజ్ యాత్రను విరమించుకోవాలని US ఎంబసీ తమ దేశస్థులకు సూచించింది.
News April 8, 2026
భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ వార్నింగ్

ట్రంప్ తన హెచ్చరికలను నిజం చేస్తూ దాడులకు దిగితే ఊహించని సర్ప్రైజ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ మిలటరీ వర్గాలు తెలిపాయి. US, దాని భాగస్వామ్య దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాయి. ఇక ఇరాన్కు ట్రంప్ విధించిన డెడ్లైన్ను 2 వారాలు పొడిగించాలని పాక్ PM షరీఫ్ కోరారు. రెండు వారాల పాటు హార్ముజ్ను తెరవాలని ఇరాన్కు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలు సీజ్ఫైర్ పాటించాలన్నారు.
News April 8, 2026
PHOTO GALLERY: ముంబైvsరాజస్థాన్

IPL: ముంబై, రాజస్థాన్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. వర్షం పడటంతో పిచ్ బౌలర్లకు సహకరిస్తుందని MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కానీ RR ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. 5 ఓవర్లలోనే 80 రన్స్ చేసి RR భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. RR బౌలర్లు సైతం న్యూ బాల్తో రాణించారు. ముంబై బ్యాటర్లను వెనువెంటనే పెవిలియన్కు పంపి ఈ సీజన్లో మూడో విజయం సాధించి టేబుల్ టాపర్ అయ్యారు.


