News June 3, 2024

ఒడిశా అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్

image

ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు ఒడిశా అసెంబ్లీని గవర్నర్ రఘుబర్ దాస్ రద్దు చేశారు. ఇప్పటికే బీజేడీ ప్రభుత్వ పదవీకాలం పూర్తయింది. దీంతో అసెంబ్లీ రద్దుకు ఇవాళ ఉదయం కేబినెట్ ఆమోదం తెలపడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నవీన్ పట్నాయక్ చూస్తున్నారు.

Similar News

News September 16, 2025

OTTలోకి ‘వార్-2’ వచ్చేది అప్పుడేనా?

image

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా ఈ నెల 25 నుంచి అక్టోబర్ 9 మధ్య ఓటీటీ(నెట్‌ఫ్లిక్స్)లో రిలీజయ్యే అవకాశం ఉంది. థియేట్రికల్ టు డిజిటల్ విండో ప్రకారం 6-8 వారాల్లో సినిమాలు OTTలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు.

News September 16, 2025

విగ్రహం వ్యవహారం.. భూమనపై కేసు నమోదు

image

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన <<17725838>>కరుణాకర్<<>> రెడ్డిపై కేసు నమోదైంది. భూమన శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ డిప్యూటీ ఈవో ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తిరుమలలో విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందని భూమన ఆరోపించారు. అయితే అది విష్ణు విగ్రహం కాదని శనీశ్వరుడి విగ్రహం అని <<17730080>>ఏపీ ఫ్యాక్ట్‌చెక్<<>> స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

News September 16, 2025

పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు పిరికివాళ్లుగా మారారు: KTR

image

TG: పార్టీ మారిన MLAలు ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని KTR అన్నారు. వాళ్లు ఎందుకు పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలన్నారు. ‘రేవంత్ చేతిలో మోసపోవడంలో ప్రజల తప్పు లేదు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించడంలో మేం విఫలమయ్యాం. చేసిన మంచిని, అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. ఆ రోజే కాంగ్రెస్ దొంగ పార్టీ అని వివరిస్తే బాగుండేది. INCకి దమ్ముంటే ఉపఎన్నికకు వెళ్లాలి’ అని పేర్కొన్నారు.