News August 19, 2024
గవర్నర్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం: సిద్దరామయ్య న్యాయవాదులు

ముడా కేసులో సీఎం సిద్దరామయ్యపై విచారణ జరపడానికి గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని సీఎం తరఫు న్యాయవాదులు కర్ణాటక హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఈ విషయంలో ఆయన ఎలాంటి కారణం చూపలేదన్నారు. గవర్నర్ క్యాబినెట్ నివేదికలకు కట్టుబడి ఉండాలని, సిద్దరామయ్య విషయంలో ఆయన చట్టవిరుద్ధంగా విచారణకు ఆదేశించారని వాదించారు.
Similar News
News January 30, 2026
టుడే ఈవెంట్స్

☀︎ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు.. ఓటు వేయనున్న 35వేల మంది లాయర్లు, Feb 10న కౌంటింగ్
☀︎ మేడారంలో సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్న TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
☀︎ 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న AP CM చంద్రబాబు
☀︎ తిరుపతిలో YCP ఆధ్వర్యంలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం
☀︎ నేడు కాకినాడ జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. JNTU విద్యార్థులతో ముఖాముఖి, కాకినాడ రూరల్ TDP కార్యకర్తలతో భేటీ
News January 30, 2026
కొన్ని సినిమాలు మహిళలను వాడుకోవడానికే తీస్తున్నారు: తమ్మారెడ్డి

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి కామెంట్స్తో సింగర్ <<18970537>>చిన్మయి<<>> విభేదించడంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ‘ఆమె చెప్పింది నిజమే. లైంగిక వాంఛలు తీర్చుకోవాలని చూసే ధోరణి పరిశ్రమలో ఒకరిద్దరు పెద్దల్లో ఉంది. అయితే అందరూ వేధింపులకు పాల్పడటం లేదు. ఏడాదికి 250 సినిమాలు నిర్మిస్తే 30-40 చిత్రాలు మహిళలను వాడుకోవడానికే తీస్తున్నవి. ఇది కాదనలేని వాస్తవం’ అని వ్యాఖ్యానించారు.
News January 30, 2026
వరాహ స్వామి, ఆదివరాహ స్వామి.. ఇద్దరూ ఒకరేనా?

వీరిద్దరూ ఒకే పరమాత్మ స్వరూపాలు. కానీ సందర్భాన్ని బట్టి పిలుస్తారు. సత్యయుగంలో భూమిని ఉద్ధరించడానికి విష్ణుమూర్తి ధరించిన అవతారాన్ని వరాహ స్వామి అంటారు. అయితే అన్ని వరాహ రూపాలకు మూలమైనవాడు, తిరుమల క్షేత్రంలో శ్రీవారి కన్నా ముందే వెలిసినవాడు కాబట్టి ఆయనను ఆది వరాహ స్వామి అంటారు. ‘ఆది’ అంటే మొదటివాడని అర్థం. ప్రళయ కాలంలో భూమిని రక్షించి, తిరిగి స్థాపించిన జగద్గురువుగా ఆయనకు ఈ విశిష్ట నామం దక్కింది.


