News August 19, 2024

గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం: సిద్దరామయ్య న్యాయవాదులు

image

ముడా కేసులో సీఎం సిద్దరామయ్యపై విచార‌ణ జ‌ర‌ప‌డానికి గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని సీఎం త‌ర‌ఫు న్యాయ‌వాదులు క‌ర్ణాట‌క హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అస‌లు ఈ విష‌యంలో ఆయ‌న ఎలాంటి కార‌ణం చూప‌లేదన్నారు. గ‌వర్నర్ క్యాబినెట్ నివేదిక‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాలని, సిద్దరామయ్య విష‌యంలో ఆయ‌న చ‌ట్ట‌విరుద్ధంగా విచార‌ణ‌కు ఆదేశించార‌ని వాదించారు.

Similar News

News January 31, 2026

IOCLలో 405 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>IOCL<<>>) వెస్ట్రన్ రీజియన్‌లో 405 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్(BA/BCom/BSc/BBA)అర్హతగల వారు సా. 5గంటల లోపు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com

News January 31, 2026

నేడు ఈ పనులు చేయకండి: పండితులు

image

శని దోష నివారణకు నేడు అనుకూలమైన రోజు. అందుకే నేడు ఎవరినీ నిందించకూడదు. అస్సలు అవమానించకూడదు. ముఖ్యంగా పనివారు, వృద్ధులు, పేదలను వేధించకూడదు. అలాగే ఇనుప వస్తువులు కొనడం నిషేధం. నల్ల నువ్వులు, నూనె వంటివి కూడా కొనుగోలు చేయకూడదట. ఆలయాలకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంటి గడపపై కూర్చోవడం లేదా గడపను తొక్కడం వంటివి కూడా చేయరాదట.

News January 31, 2026

నేడే పింఛన్ల పంపిణీ

image

AP: రాష్ట్రంలో ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రేపు ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఈరోజే నగదు అందజేయనున్నారు. కుప్పంలో గుడుపల్లె(M) బెగ్గిలిపల్లెలో CM చంద్రబాబు నగదు పంపిణీ చేయనున్నారు. కొత్తగా మంజూరైన 7,944 వితంతు పింఛన్లతో కలిపి మొత్తం 62.94 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేస్తారు. ఇవాళ నగదు అందుకోలేకపోతే FEB 2న తీసుకోవచ్చని తెలిపింది.