News March 18, 2025

GOVT జాబ్ కొట్టిన సూర్యాపేట జిల్లా బిడ్డ 

image

సూర్యాపేట జిల్లా శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన నిమ్మనగోటి మల్లేశ్ ఇటీవల ప్రకటించిన టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఫలితాల్లో సత్తాచాటారు. రాష్ట్ర స్థాయిలో 50వ, జోనల్ స్థాయిలో 14వ ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. పేదింటి బిడ్డ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించారని స్థానికులు అతడిని అభినందించారు. తన విజయంలో తల్లిదండ్రులు, మిత్రుల సహకారం ఉందని మల్లేశ్ తెలిపారు.

Similar News

News November 7, 2025

VJA: మాజీ డీసీపీ విశాల్‌ గున్ని కేసు అప్డేట్ ఇదే.!

image

విజయవాడ మాజీ డీసీపీ విశాల్‌ గున్ని సస్పెన్షన్‌ను ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు తక్షణం విధుల్లోకి తీసుకొని ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలని ఇటీవల క్యాట్‌ ఉత్తర్వులను ఇచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని విచారణను వాయిదా వేయాలి’ అని ప్రభుత్వ న్యాయవాది కోరారు. విచారణను నవంబర్ 11కి వాయిదా వేసింది.

News November 7, 2025

రెబ్బెన: హత్య కేసు నిందితుడు పరార్!

image

హత్య కేసులో విచారణ కోసం తీసుకొచ్చిన ఓ నిందితుడు రెబ్బెన పోలీస్ స్టేషన్ నుంచి పరారు కావడం కలకలం రేపింది. చేతికి వేసిన సంకెళ్లతో స్టేషన్ నుంచి పారిపోయినట్లు సమాచారం. 5 రోజుల క్రితం తిర్యాణి మండలం పిట్టగూడాకి చెందిన హన్మంత్ రావును అదే గ్రామానికి చెందిన సిడం వినోద్ గొడ్డలితో నరికి చంపాడు. దీంతో వినోద్‌ను పోలీసులు తీసుకొచ్చి విచారించారు. కాగా 4 రోజులుగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

News November 7, 2025

ముందు ‘రూ./-’ వెనక ‘మాత్రమే’ ఎందుకు?

image

చెక్స్ లేదా చందా బుక్స్ తదితరాలపై అమౌంట్ రాసేటప్పుడు అంకెల ముందు ‘రూ.’ అని పెడతాం (Ex: రూ.116/-). ఇక అక్షరాల్లో రాస్తే చివర్లో ‘మాత్రమే’ (Ex: వంద రూపాయలు మాత్రమే) పేర్కొంటాం. ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూరిటీ రీజన్‌తో ఈ పద్ధతి మొదలైంది. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం కానీ ఒకప్పుడు చేతి రాతలతో మాన్యువల్‌గా పనులు జరిగేవి. దీంతో అమౌంట్ ముందు లేదా వెనక ఏ నంబర్/పదం యాడ్ చేయలేకుండా బ్యాంకులు ఈ పద్ధతి మొదలుపెట్టాయి.