News March 11, 2025
GOVT జాబ్ సాధించిన నారాయణపేట జిల్లా యువతి

నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపుల గ్రామానికి చెందిన జోగు శ్వేతశ్రీ ఇండియన్ రైల్వేలో ఉద్యోగం సాధించారు. ఇటీవల లోకో పైలట్గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఆమె ప్రస్తుతం బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలో విధుల్లో చేరారు. తల్లిదండ్రులు లేకపోయినా పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని ఆమె నిరూపించిందని గ్రామస్థులు తెలిపారు. తన భర్త జోగు ప్రవీణ్ సహకారంతో ఈ ఉద్యోగం సాధించానని ఆమె చెప్పారు.
Similar News
News October 30, 2025
ఆలస్యంగా ఎందుకు నిద్ర లేవకూడదు?

మన పూర్వీకులు ప్రకృతిని దైవంగా భావించేవారు. వ్యవసాయం, చేతిపనులతో భూమితో బంధాన్ని కలిగి ఉండేవారు. ఆ జీవన విధానం వారికి ప్రశాంతతను ఇచ్చేది. కానీ నేడు ఉద్యోగాల వల్ల ఆ పద్ధతి దూరమవుతోంది. ఆధునిక జీవనంలో ఇంట్లో ఖాళీ సమయం పెరిగి, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక బద్ధకస్తులమవుతున్నారు. శారీరక శ్రమ, ప్రకృతితో అనుబంధం లేకపోవడం వల్ల ఈ నిగ్రహాన్ని కోల్పోతున్నాం. అందుకే మంచిది కాని ఈ అలవాటును వదలాలి. <<-se>>#JEEVANAM<<>>
News October 30, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షం

TG: నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మేడ్చల్, మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మీ ప్రాంతంలో వాన కురుస్తోందా?
News October 30, 2025
పీఎంశ్రీ నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలి: కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లాలోని 44 పీఎంశ్రీ పాఠశాలలకు వచ్చిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె, పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న సివిల్ వర్క్లను నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.


