News March 11, 2025

GOVT జాబ్ సాధించిన నారాయణపేట జిల్లా యువతి 

image

నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపుల గ్రామానికి చెందిన జోగు శ్వేతశ్రీ ఇండియన్ రైల్వేలో ఉద్యోగం సాధించారు. ఇటీవల లోకో పైలట్‌గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఆమె ప్రస్తుతం బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలో విధుల్లో చేరారు. తల్లిదండ్రులు లేకపోయినా పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని ఆమె నిరూపించిందని గ్రామస్థులు తెలిపారు. తన భర్త జోగు ప్రవీణ్ సహకారంతో ఈ ఉద్యోగం సాధించానని ఆమె చెప్పారు. 

Similar News

News January 8, 2026

మిరపలో నల్ల తామర పురుగుల నివారణ ఎలా?

image

మిరపలో నల్ల తామర పురుగుల తీవ్రతను బట్టి ఎకరానికి 25కు పైగా నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బవేరియా బస్సియానా 5 గ్రాములు లేదా స్పైనటోరం 0.9ml మందును లేదా ఫిప్రోనిల్ 5% ఎస్.సి 2ML లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3MLలలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఉద్ధృతిని బట్టి ఈ మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 8, 2026

13 మంది ప్రాణాలు తీసిన ఏనుగు

image

ఝార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. 2 రోజుల్లోనే 13 మందిని చంపేయగా, మరో నలుగురు గాయపడ్డారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ‘5వ తేదీన కోల్హాన్‌లో ఏనుగు దాడిలో ఏడుగురు, 6న నోవాముండి, హటగమారియలో ఆరుగురు మృత్యువాతపడ్డారు’ అని చెప్పారు. ఆ గజరాజును అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అక్కడ గత DEC 16 నుంచి ఏనుగుల దాడిలో 22 మంది ప్రాణాలు వదిలారు.

News January 8, 2026

‘కాకినాడ’కు ఆ పేరు ఎలా వచ్చిందో.. మీకు తెలుసా..?

image

చారిత్రక నగరమైన కాకినాడ పేరు వెనుక అనేక ఆసక్తికర కథనాలు ఉన్నాయి. బ్రిటీష్, ఫ్రెంచ్ కాలంలో తొలుత ‘కోకెనడా’గా, కాలక్రమేణా ‘కోకనందవాడ’, ‘కాకివాడ’, ‘కోకనాడ’గా రకరకాలుగా పిలిచేవారు. విదేశీయులు, క్రైస్తవ మత ప్రచారకులు పెట్టిన పేర్లు ఎన్ని ఉన్నా, చివరికి వాడుక భాషలో స్థిరపడి ‘కాకినాడ’గా రూపాంతరం చెందింది. నేడు జిల్లా కేంద్రంగా విరాజిల్లుతున్న ఈనగరం పేరుపై ఇప్పటికీ ఆసక్తికర చర్చలు జరుగుతుంటాయి.