News July 10, 2024
ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ VRSకు ప్రభుత్వం ఆమోదం

AP: సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)కు ప్రభుత్వం ఓకే చెప్పింది. గత ప్రభుత్వంలో కీలకమైన సాధారణ పరిపాలన శాఖతో పాటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. కొత్త ప్రభుత్వం రాగానే ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఏడేళ్ల సర్వీస్ ఉండగానే VRSకు దరఖాస్తు చేసుకున్నారు. విద్యాశాఖ టెండర్లలో నిబంధనలు పట్టించుకోలేదని ఆయనపై ఆరోపణలున్నాయి.
Similar News
News April 1, 2026
పెరిగిన ఇండిగో విమాన టికెట్ల ధరలు

విమాన ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు ఇండిగో సిద్ధమైంది. ఏప్రిల్ 2 నుంచి టికెట్ బుకింగ్స్పై ఇంధన ఛార్జీలను సవరించనున్నట్లు ప్రకటించింది. దూరాన్ని బట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్లో ₹275-₹950, ఇంటర్నేషనల్ సర్వీసులలో ₹900-₹10,000 వరకు ఫ్యూయల్ ఛార్జెస్ పెరుగుతాయని తెలిపింది. డొమెస్టిక్ ఎయిర్లైన్స్కు 25%, ఇంటర్నేషనల్ సర్వీసెస్పై 100% ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
News April 1, 2026
LokPoll సర్వే.. మళ్లీ డీఎంకేదే అధికారం!

త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని LokPoll సర్వే వెల్లడించింది. DMK+కు 40.1% ఓట్లతో 181–189 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి 29% ఓట్లు, 38-42 సీట్లు, విజయ్ నేతృత్వంలోని TVK 23.9% ఓట్లు, 8-10 సీట్లు సాధిస్తాయని పేర్కొంది. ఇక సీఎంగా స్టాలిన్కు 41%, విజయ్కి 27.1%, పళనిస్వామికి 24.1% మంది మద్దతు పలికారని తెలిపింది.
<<-se>>#ELECTIONS2026<<>>
News April 1, 2026
పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ గడువు పొడిగింపు

AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ మాఫీ గడువును ఈనెల 30 వరకు GOVT పొడిగించింది. ఈ స్కీమ్ ప్రకటించాక 14 రోజుల పనిదినాలే ఉండటంతో వినియోగించుకోలేకపోయామని వినియోగదారుల నుంచి అభ్యర్థనలు రావడంతో గడువును పొడిగిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ట్యాక్స్ వసూళ్లపై దృష్టి పెట్టాలని, మున్సిపాల్టీల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని కమిషనర్లను ఆదేశించారు.


