News October 29, 2024

ప్రభుత్వం కబుర్లు చెబుతోంది: BRS

image

TG: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని నడపాల్సిన పనిని మరిచిపోయి ప్రజలకు కబుర్లు చెప్పడంలో బిజీగా మారిందని ప్రతిపక్ష BRS సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితికిపోయిందని, ఆయన అసమర్థత రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని దుయ్యబట్టింది. రెవెన్యూ టార్గెట్ రూ.2.74లక్షల కోట్లు కాగా 6 నెలల్లో కేవలం రూ.1.08లక్షల కోట్లు మాత్రమే సాధించినట్లు పేర్కొంది.

Similar News

News November 17, 2025

సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చిస్తున్నారు. తొలుత వచ్చే నెలలో షెడ్యూల్ ఇవ్వాలని భావించినా దాన్ని ఈ నెలలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. SC ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్. తొలుత నిర్వహించే సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.

News November 17, 2025

సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చిస్తున్నారు. తొలుత వచ్చే నెలలో షెడ్యూల్ ఇవ్వాలని భావించినా దాన్ని ఈ నెలలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. SC ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్. తొలుత నిర్వహించే సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.

News November 17, 2025

AP న్యూస్ అప్‌డేట్స్

image

*మంత్రి సత్యకుమార్ పేరిట TTD నకిలీ లెటర్లు.. VJA పోలీసులకు PA ఫిర్యాదు
*పరకామణి కేసు వెనుక ఎవరున్నారో తేల్చాలి: మంత్రి పార్థసారథి
*తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
*డిజిటల్ అరెస్టుల కట్టడికి ‘సైబర్ సురక్ష’ పేరిట నెల రోజులపాటు VJA పోలీసుల అవగాహన కార్యక్రమాలు
*రాజధాని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని JAC నిర్ణయం