News March 18, 2024
ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు: మాజీమంత్రి

నల్లగొండ మండలం అన్నపర్తి గ్రామంలో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందరోజుల కాంగ్రెస్ పాలనలో రైతుల పట్ల నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అధికారులు, మంత్రులు ఎండిన పొలాలను పరిశీలించలేదని, మంత్రులు ముడుపులపై తాపత్రంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరత్నం రాజు, రైతులు పాల్గొన్నారు.
Similar News
News January 21, 2026
NLG: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు భేష్

జిల్లాలో పౌర సరఫరాల శాఖ ద్వారా 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిలో సాగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక కొనుగోలు విధానం రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి చెల్లింపులు జరగడం వల్ల రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై విశ్వాసం పెరిగింది. ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.
News January 21, 2026
NLG: ఆరేళ్లు గడిచినా.. ఎన్నికల లెక్కలు చెప్పలే!

జిల్లాలో గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన 548 మంది అభ్యర్థులు నేటికీ ఎన్నికల ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించలేదు. జిల్లాలోని నకిరేకల్ మినహా నల్గొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూర్, చిట్యాల మున్సిపాలిటీలో 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 707 మంది పోటీ చేశారు. వీరిలో 159 మంది మాత్రమే ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలను అధికారులకు సమర్పించారు.
News January 21, 2026
నల్గొండ: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. 30 లాస్ట్ డేట్

దివ్యాంగులు వారికి అవసరమైన ఉపకరణాల కోసం ఈ నెల 30లోగా tso bmms.cgg.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తెలిపారు. 100 శాతం సబ్సిడీతో అర్హులైన దివ్యాంగులకు మొబైల్ బిజినెస్ బ్యాటరీ సైకిల్, ట్యాప్టాప్, ట్యాబ్స్, మూడు చక్రాల రిక్షాలు, వీల్ చైర్స్, చంక కర్రలు, హియరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్ తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ అందజేస్తుందని తెలిపారు.


