News November 28, 2024
ఈగల్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

AP: డ్రగ్స్ నియంత్రణకు <<14724446>>ఈగల్ను <<>>ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను నెలకొల్పనుంది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా, సిబ్బందిని డిప్యూటేషన్పై తీసుకోవాలని ఆదేశించింది. అటు డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది.
Similar News
News December 18, 2025
రెచ్చిపోతున్న బంగ్లాదేశ్.. భారత్పై అక్కసు

బంగ్లాదేశ్ అవకాశం చిక్కినప్పుడల్లా భారత్పై విషం చిమ్ముతోంది. కొన్ని రోజుల క్రితం ఢాకా వర్సిటీలో PM మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయనను దూషించారు. ఈశాన్య రాష్ట్రాలను(7 సిస్టర్స్) తమ దేశంలో కలిపేస్తామంటూ ఇద్దరు టాప్ స్టూడెంట్ లీడర్లు బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. ఇవాళ ఢాకాలోని భారత ఎంబసీ వద్ద ఆందోళనకు దిగారు. యూనుస్ బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి ఈ ధోరణి కనబడుతోంది.
News December 18, 2025
నాణ్యమైన నిద్ర కోసం 10-3-2-1-0 రూల్!

10-3-2-1-0 రూల్తో నాణ్యమైన నిద్ర సొంతమవుతుంది. నిద్రకు 10 గంటల ముందు కెఫిన్ ఉండే పదార్ధాలను (టీ, కాఫీ) తీసుకోవద్దు. 3 గంటల ముందే భోజనం చేయాలి. ఆల్కహాల్ తాగొద్దు. 2 గంటల ముందు పని, ఒత్తిడికి ఫుల్స్టాప్ పెట్టాలి. గంట ముందు మొబైల్/ల్యాప్టాప్ స్క్రీన్ ఆఫ్ చేయాలి. మార్నింగ్ అలారం మోగిన వెంటనే లేవాలి. స్నూజ్ బటన్ ఉపయోగించొద్దు. ఈ రూల్స్తో నిద్ర నాణ్యత పెరిగి రోజంతా ఫ్రెష్గా ఉంటారు. ప్రయత్నించండి!
News December 17, 2025
నార్త్లో ఎందుకు.. సౌత్లో వేదికల్లేవా? ఫ్యాన్స్ ఫైర్

పొగమంచుతో 4వ టీ20 రద్దు కావడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. శీతాకాలంలో పొగమంచు కురిసే నార్త్ స్టేట్స్లో మ్యాచ్లు షెడ్యూల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంచు సమస్య ఉండే వేదికల్లో రాత్రి 7గంటలకు కాకుండా మధ్యాహ్నం మ్యాచ్లు నిర్వహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పొగమంచు సమస్య తక్కువని ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే ఛాన్స్లు పరిశీలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.


