News November 28, 2024

ఈగల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: డ్రగ్స్ నియంత్రణకు <<14724446>>ఈగల్‌ను <<>>ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను నెలకొల్పనుంది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా, సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ఆదేశించింది. అటు డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది.

Similar News

News December 22, 2025

27న మండల పూజ.. ఆ రోజుల్లో శబరిమల ఆలయం మూసివేత

image

శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ నిర్వహించనున్నారు. ఉదయం 10.10AM నుంచి 11.30AM వరకు కొనసాగనుంది. ‘26న 6.30PMకు పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరుకుంటాయి. స్వామిని అలంకరించి దీపారాధన నిర్వహిస్తాం. 27న రాత్రి 11 గంటలకు హరివరాసనం అనంతరం ఆలయం మూసివేస్తాం. తిరిగి మకరవిళక్కు ఉత్సవం కోసం 30న 5PMకు గుడిని తెరుస్తాం’ అని ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు తెలిపారు.

News December 22, 2025

అమ్మాయికి ఈ టెస్టులు చేయించండి..

image

ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారి ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వారు రజస్వల అయినప్పటి నుంచి వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. రక్తహీనత సమస్యను గుర్తించడానికి కంప్లీట్ బ్లడ్ కౌంట్, థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు, విటమిన్‌ప్రొఫైల్‌ టెస్ట్‌, ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలుంటే మూత్ర పరీక్ష చేయించాలి. వీటివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించే వీలుంటుంది.

News December 22, 2025

ఇంట్లో వెండి శివలింగం ఎందుకు ఉండాలి?

image

వెండి శుక్రుడు, చంద్రుడికి ప్రతీక. వెండి శివలింగ నిత్యారాధన ఆర్థిక బాధలు తొలగించి ఐశ్వర్యాన్ని ఇస్తుందని నమ్మకం. అలాగే ఇంట్లోని ప్రతికూల శక్తిని పంపి, కుటుంబంలో మానసిక ప్రశాంతతను, అన్యోన్యతను పెంచుతుందని విశ్వాసం. చంద్ర దోషం ఉన్నవారు, మానసిక ఒత్తిడితో బాధపడేవారు, సంతాన సమస్యలున్నవారు దీనిని పూజించాలట. తద్వారా శుభ ఫలితాలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. శివలింగారాధన ధైర్యాన్నిస్తుంది.