News April 14, 2025

మే నాటికి GPOల నియామకం: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్రంలోని 10,956 గ్రామాల్లో మే నాటికి గ్రామ పాలనాధికారుల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుతం 480 మంది సర్వేయర్లు ఉన్నారని, వారి సంఖ్యను 1000కి పెంచుతామని తెలిపారు. ‘భూ భారతి’ చట్టాన్ని జూన్ 2లోగా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తామన్నారు. ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Similar News

News December 13, 2025

వారితో కేరళ విసిగిపోయింది: మోదీ

image

తిరువనంతపురం కార్పొరేషన్‌లో NDA <<18552178>>గెలవడం<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ‘థాంక్యూ తిరువనంతపురం. ఈ గెలుపు కేరళ రాజకీయాల్లో కీలక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే తీర్చగలదని ప్రజలు నిశ్చయించుకున్నారు. UDF, LDFతో కేరళ విసిగిపోయింది. వికసిత్ కేరళకు, సుపరిపాలనకు మరో ఆప్షన్‌గా ఎన్డీయేను ప్రజలు చూస్తున్నారు’ అని పలు ట్వీట్లు చేశారు. BJP-NDAకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

News December 13, 2025

TGCABలో ఇంటర్న్‌‌గా చేరాలనుకుంటున్నారా?

image

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (<>TGCAB<<>>) HYD 7 ఇంటర్న్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MBA/మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్/అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్/రూరల్ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్ అర్హతగల వారు DEC 23 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 21ఏళ్లు. ఎంపికైనవారికి నెలకు రూ.25వేలు చెల్లిస్తారు. విద్యార్హత, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. tgcab.bank.in

News December 13, 2025

ఏ పంటలకు ఎలాంటి కంచె పంటలతో లాభం?

image

☛ వరి పొలం గట్ల మీద కంచె పంటలుగా బంతి మొక్కలను నాటి నులిపురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ పత్తి చేను చుట్టూ కంచెగా సజ్జ, జొన్న, మొక్కజొన్నను 3-4 వరుసల్లో వేస్తే బయటి పురుగులు రాకుండా ఆపవచ్చు. ☛వేరుశనగలో జొన్న, సజ్జ కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు, తిక్కా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి తగ్గుతుంది. ☛ మొక్కజొన్న చుట్టూ 4, 5 వరుసల ఆముదపు మొక్కలను దగ్గరగా వేస్తే అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు.