News September 22, 2024

తిరుమల నెయ్యి ట్యాంకర్లకు GPS, ఎలక్ట్రిక్ లాకింగ్

image

AP: తిరుమలకు పంపే ‘నందిని’ ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్‌ను ఓపెన్ చేయలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుందని పేర్కొన్నారు. టీటీడీకి నెల రోజుల క్రితం నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని వివరించారు.

Similar News

News November 18, 2025

POK ప్రధానిగా రజా ఫైసల్

image

పాక్ ఆక్రమిత కశ్మీర్ నూతన ప్రధానిగా PPP నేత రజా ఫైసల్ ముంతాజ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ PTI పార్టీకి చెందిన అన్వరుల్ హక్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆమోదం లభించడంతో కొత్త ప్రధాని కోసం ఓటింగ్ నిర్వహించారు. 52 సభ్యులకు గాను ముంతాజ్‌కు 32 మంది అనుకూలంగా ఓటేశారు. కాగా POKకు స్వయంప్రతిపత్తిని కల్పించినట్లు చెప్పుకునే పాక్ అక్కడ నామమాత్రపు PM, ప్రెసిడెంట్ పదవులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

News November 18, 2025

POK ప్రధానిగా రజా ఫైసల్

image

పాక్ ఆక్రమిత కశ్మీర్ నూతన ప్రధానిగా PPP నేత రజా ఫైసల్ ముంతాజ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ PTI పార్టీకి చెందిన అన్వరుల్ హక్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆమోదం లభించడంతో కొత్త ప్రధాని కోసం ఓటింగ్ నిర్వహించారు. 52 సభ్యులకు గాను ముంతాజ్‌కు 32 మంది అనుకూలంగా ఓటేశారు. కాగా POKకు స్వయంప్రతిపత్తిని కల్పించినట్లు చెప్పుకునే పాక్ అక్కడ నామమాత్రపు PM, ప్రెసిడెంట్ పదవులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

News November 18, 2025

పిల్లల చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

image

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్నానానికి ముందు నువ్వుల నూనెలను ఒంటికి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి. సబ్బు వీలైనంత తక్కువగా వాడాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్‌ రాయాలి. సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్, మ్యాంగో బటర్‌ కాంబినేషన్‌లో ఉండే వాటిని ఎంచుకోవాలి. ఇవి పిల్లల చర్మాన్ని మృదువుగా చేస్తాయి.