News September 22, 2024
తిరుమల నెయ్యి ట్యాంకర్లకు GPS, ఎలక్ట్రిక్ లాకింగ్

AP: తిరుమలకు పంపే ‘నందిని’ ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్ను ఓపెన్ చేయలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుందని పేర్కొన్నారు. టీటీడీకి నెల రోజుల క్రితం నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని వివరించారు.
Similar News
News November 23, 2025
వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం.. IBSA నాయకులతో మోదీ

జొహనెస్బర్గ్లో జరుగుతున్న G20 సమ్మిట్లో IBSA (ఇండియా-బ్రెజిల్-సౌతాఫ్రికా) నాయకులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వాలకు IBSA డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్, IBSA ఫండ్ ఫర్ క్లైమేట్ రెసిలియెంట్ అగ్రికల్చర్ ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. 40 దేశాల్లో విద్య, హెల్త్, మహిళా సాధికారతకు IBSA ఇస్తున్న మద్దతును ప్రశంసించారు.
News November 23, 2025
డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే ‘రైతన్నా.. మీకోసం’: జగన్

AP: రైతులను కాలర్ ఎగరేసుకునేలా చేస్తామని చెప్పి ఎండమావులు చూపిస్తారా అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. రైతుల ఒంటి మీద చొక్కా తీసేసి రోడ్డు మీద నిలబెట్టారని ఫైరయ్యారు. రైతుల కష్టాలు, బాధలపై చర్చ జరగకుండా చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంట్ ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం అని విమర్శించారు. 18 నెలల్లో రైతుల కోసం ఎప్పుడు నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారు? అని జగన్ Xలో ప్రశ్నించారు.
News November 23, 2025
అతి పురాతన నక్షత్రాలను నాసా గుర్తించిందా?

బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వంలో ఏర్పడిన పురాతన నక్షత్రాలను NASAకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించినట్టు తెలుస్తోంది. భూమికి 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో LAP1-B గెలాక్సీలో ఉన్న Population III లేదా POP III అని పిలిచే ఈ స్టార్స్ హైడ్రోజన్, హీలియం తక్కువ ఉండే ఉష్ణోగ్రతల్లో ఏర్పడ్డాయి. సూర్యుని ద్రవ్యరాశి కంటే 100 రెట్లు తీవ్రమైన అల్ట్రావయొలెట్ను విడుదల చేస్తున్నట్టు గుర్తించారు.


