News March 20, 2025

547 కేంద్రాల ద్వారా పంట సేకరణ: మార్క్‌ఫెడ్

image

AP: రాష్ట్రంలో 547 కొనుగోలు కేంద్రాల ద్వారా పంట సేకరణ పారదర్శకంగా జరుగుతోందని మార్క్‌ఫెడ్ వెల్లడించింది. కందికి క్వింటాల్‌కు రూ.7,550, శనగలకు రూ.5,650, పెసలుకు రూ.8,682 మద్దతు ధర ఇస్తున్నట్లు పేర్కొంది. CMAPP ద్వారా ఎప్పటికప్పుడు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపింది. అన్నదాతలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

Similar News

News December 28, 2025

హాదీ హంతకులు భారత్‌లోనే ఉన్నారు: ఢాకా పోలీసులు

image

బంగ్లా పొలిటికల్ యాక్టివిస్ట్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులు భారత్‌లో ఉన్నట్లు ఢాకా పోలీసులు ఆరోపిస్తున్నారు. ‘ఫైసర్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్ స్థానికుల సాయంలో మైమన్‌సింగ్‌లో బార్డర్ క్రాస్ చేశారు. భారత్‌లో వారిని పూర్తి అనే వ్యక్తి రిసీవ్ చేసుకున్నారు. సామీ అనే టాక్సీ డ్రైవర్ వారిని మేఘాలయాలో తురా సిటీకి తీసుకెళ్లారు. భారత అధికారులను సంప్రదిస్తున్నాం’ అని అడిషనల్ కమిషనర్ నజ్రూల్ తెలిపారు.

News December 28, 2025

గాలిపటం కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

image

TG: గాలిపటం కొనివ్వలేదని రెండో తరగతి చదువుతున్న బాలుడు(9) ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మహబూబ్‌నగర్(D) చిల్వేర్‌లో జరిగింది. రాజు-శ్రీలత దంపతుల కుమారుడు సిద్ధూ పతంగి కొనివ్వమని అడగగా నిరాకరించారు. దీంతో అతడు పేరెంట్స్‌ను భయపెట్టాలని ఇంటి స్లాబ్‌కు చీరతో ఉరి వేసుకున్నట్లు నటించాడు. కానీ దురదృష్టవశాత్తు అది మెడకు బిగుసుకుపోయింది. విలవిల్లాడుతున్న సిద్ధూను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

News December 28, 2025

లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఉంచాల్సిన వస్తువులివే..

image

లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, శ్రీఫలం, తామర గింజలు, గురువింద గింజలు వంటి వస్తువులు లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షిస్తాయని పండితులు చెబుతున్నారు. వీటితో పాటు ముత్యాలు, రూపాయి కాసులు, చిట్టి గాజులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవని అంటున్నారు. ఈ మంగళకరమైన వస్తువులను పూజ గదిలో ఉంచి భక్తితో ఆరాధించడం వల్ల ప్రతికూల శక్తి తొలగి, ఇంట్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూచిస్తున్నారు.