News March 20, 2025
547 కేంద్రాల ద్వారా పంట సేకరణ: మార్క్ఫెడ్

AP: రాష్ట్రంలో 547 కొనుగోలు కేంద్రాల ద్వారా పంట సేకరణ పారదర్శకంగా జరుగుతోందని మార్క్ఫెడ్ వెల్లడించింది. కందికి క్వింటాల్కు రూ.7,550, శనగలకు రూ.5,650, పెసలుకు రూ.8,682 మద్దతు ధర ఇస్తున్నట్లు పేర్కొంది. CMAPP ద్వారా ఎప్పటికప్పుడు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపింది. అన్నదాతలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
Similar News
News March 21, 2025
REWIND: ‘జనతా కర్ఫ్యూ’ గుర్తుందా?

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదేరోజున ‘జనతా కర్ఫ్యూ’ విధించిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడప్పుడే వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు దేశమంతటా స్వచ్ఛంద బంద్కు కేంద్రం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్ విధించింది. ఎక్కడికక్కడ దేశం స్తంభించడంతో వలస జీవులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కరోనా మీపై ఎలాంటి ప్రభావం చూపింది? COMMENT
News March 21, 2025
ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు

AP: అలిపిరిలో ముంతాజ్, మరో హోటల్కు గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని రద్దు చేస్తున్నట్లు CM చంద్రబాబు తిరుమలలో ప్రకటించారు. ఏడుకొండలను ఆనుకొని కమర్షియలైజేషన్ ఉండకూడదన్నారు. శ్రీవారి ఆస్తులన్నీ కాపాడటమే లక్ష్యమన్నారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయం కట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. సీఎంలు ముందుకొస్తే నిర్మాణాలు చేపడతామన్నారు. అంతకుముందు ఆయన దేవాన్ష్ బర్త్డే సందర్భంగా అన్నవితరణ చేశారు.
News March 21, 2025
వారం రోజుల్లో ‘కోర్ట్’ కలెక్షన్లు ఎంతంటే?

థియేటర్లలో ‘కోర్ట్’ సినిమా కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన తొలి వారంలోనే ఈ సినిమా రూ.39.60+ కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు, విమర్శకులు ఇచ్చిన బ్లాక్ బస్టర్ తీర్పుతో రెండో వారంలోకి ప్రవేశించిందని పేర్కొంది. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.