News October 18, 2025
ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు

AP: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 10,700 మంది సిబ్బందితో సన్నాహాలు చేస్తున్నాం. 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మిల్లర్లు పనిచేయాలి. ధాన్యం 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News October 18, 2025
విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

AP: VSP పార్ట్నర్షిప్ సమ్మిట్పై భారీ అంచనాలున్నాయి. పారిశ్రామికవేత్తలను పిలిచేందుకు CBN, లోకేశ్ విదేశాలకు వెళ్తున్నారు. గూగుల్, TCS వంటి సంస్థల రాకతో ఈసారి పెట్టుబడులు పెరగొచ్చంటున్నారు. కాగా 2016లో ₹7.03L Cr, 2017లో ₹6.98L Cr, 2018లో ₹3.10L Cr పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిలో పెండింగ్ అంశాల్ని పట్టాలెక్కించడంతో పాటు ఈసారి కొత్తవారిని ఆహ్వానించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News October 18, 2025
కమ్యూనిటీ బయింగ్: 186 కార్లకు ₹21 కోట్ల డిస్కౌంట్!

షాపింగులో బల్క్గా కొంటే ఏమైనా తగ్గిస్తారా అని బేరమాడటం చూస్తుంటాం. గుజరాత్లోని జైన్ కమ్యూనిటీ సభ్యులు దీనిని వేరే లెవల్కు తీసుకెళ్లారు. ఏకంగా 186 లగ్జరీ కార్లను ఒకే డీల్లో కొనుగోలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ కార్ల విలువ ₹149.54 కోట్లు కాగా, వారు రూ.21.22 కోట్లు డిస్కౌంట్ పొందడం విశేషం. ఒకే కమ్యూనిటీకి చెందినవారు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి లగ్జరీ కార్లను కొనడం దేశంలోనే చర్చనీయాంశమైంది.
News October 18, 2025
బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

భారతదేశపు బంగారం నిల్వల విలువ మొదటిసారిగా $100 బిలియన్ మైలురాయిని అధిగమించింది. మొత్తంగా $102 బిలియన్లు దాటినట్లు RBI డేటా పేర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇదెంతగానో బలం చేకూర్చనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం RBI విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 14.7% కి చేరింది.