News August 1, 2024

తెలంగాణకు రైల్వే లైన్లు మంజూరు చేయండి: రఘునందన్

image

తెలంగాణకు కొత్త రైల్వేలైన్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్‌కు, కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు కొత్త లైన్లు ప్రారంభించాలని కోరారు. HYD MMTS విస్తరణపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా రాబట్టి ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News January 24, 2026

కీలక మీటింగ్‌కు గైర్హాజరు.. స్పందించిన శశి థరూర్

image

కాంగ్రెస్ కీలక సమావేశానికి గైర్హాజరుపై వస్తున్న వార్తలను ఆ పార్టీ MP శశి థరూర్ తోసిపుచ్చారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగ వేదికలపై చర్చించబోనన్నారు. ‘రాజకీయ ప్రకటనలు చేయడానికి రాలేదు. సొంత పార్టీ నాయకులతో చర్చించాల్సిన సమస్యలపై పబ్లిక్‌లో మాట్లాడను. పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లినప్పుడు పార్టీ నాయకులతో మాట్లాడే ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నాను’ అని కేరళ సాహిత్య ఉత్సవంలో చెప్పారు.

News January 24, 2026

CCMBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

హైదరాబాద్‌లోని <>CCMB<<>> 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PhD, MD/MS/MDS, MVSc, M.Pharm, ME, MTech, B.Tech, NET, GATE, టెన్త్ అర్హత తో పాటు పని అనుభవంగల వారు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in

News January 24, 2026

క్రెడిట్ చోరీయా… జగన్‌కు ఏం క్రెడిట్ ఉంది: CBN

image

AP: జగన్ చేసిన పనుల్ని ప్రజలు మరిచిపోతే మళ్లీ వినాశనమే అని CM CBN హెచ్చరించారు. ‘తన మనుషుల్ని పెట్టుకొని ల్యాండ్ టైటిలింగ్‌తో భూమి కాజేసే ప్రయత్నం చేశారు. చివరకు దేవునికిచ్చిన నెయ్యినీ కల్తీ చేశారు. రాక్షసపాలన సాగించారు. తప్పుడు కేసుతో నన్ను జైల్లో పెట్టారు. ఇప్పుడు అమరావతిని అడ్డుకుంటున్నారు. నేను క్రెడిట్ చోరీ చేశానంటున్నారు. ఆయనకేం క్రెడిట్ ఉంది. ఇలాంటి వారిపట్ల జాగ్రత్త’ అని సూచించారు.