News April 25, 2024

GREAT.. మన సంగారెడ్డి యువకుడు సైంటిస్ట్ అయ్యాడు

image

ఝరాసంగం మండలం కమాల్‌పల్లికి చెందిన శ్రీశైలం వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. సామాన్య కుటుంబంలో పుట్టి సాగుపై మక్కువతో చదివిన శ్రీశైలం.. ISRB నిర్వహించిన జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక పరీక్షల ఫలితాల్లో సత్తా చాటారు. అరుణాచల్‌ప్రదేశ్ కేడర్ వ్యవసాయ శాస్త్రవేత్త(ఏఎస్‌ఆర్‌బీ)గా ఉద్యోగం సాధించారు. శ్రీశైలం విద్యాభ్యాసం 10వ తరగతి వరకు ఝరాసంగం పాఠశాలలో జరిగింది. -CONGRATS

Similar News

News December 20, 2025

MDK: నాడు భార్య.. నేడు భర్త సర్పంచ్

image

వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్‌గా వంచ భూపాల్ రెడ్డి గెలవగా గతంలో ఆయన భార్య భాగ్యమ్మ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబంలో భార్య, భర్త సర్పంచ్‌లుగా అవకాశం రావడం అరుదు అని గ్రామస్థులు అన్నారు. బుధవారం జరిగిన ఎన్నికలలో భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.

News December 20, 2025

మెదక్: నాడు తండ్రి.. నేడు కొడుకు సర్పంచ్

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో నాడు తండ్రి సర్పంచ్ కాగా.. నేడు తనయుడు సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్‌గా కందాల రాజ నర్సింహా విజయం సాధించగా ఆయన తండ్రి కందాల సాయిలు గతంలో ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గెలిచారు.

News December 19, 2025

మెదక్: ‘అప్రమత్తతో ప్రాణ నష్ట నివారణ’

image

ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణత్యాగాలు నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. పకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ నిర్వాహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. 22న నిర్వహించే మాక్ ఎక్సర్సైజ్ విజయవంతం చేయాలని సూచించారు.