News February 27, 2026

GREAT.. ‘ఆర్ఎంసీ’లో భూపాలపల్లి సౌమ్య ప్రతిభ

image

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఎంసీ) ప్రవేశ పరీక్షలో జయకేతనం ఎగరేసి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం సౌమ్య సత్తా చాటారు. దక్షిణ భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక బాలికగా ఆమె రికార్డు సృష్టించారు. భవిష్యత్తులో ఆర్మీలో ఉన్నత అధికారిణిగా సేవలు అందించడమే తన లక్ష్యమని సౌమ్య పేర్కొన్నారు. ఈ విజయంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 28, 2026

ఆసిఫాబాద్: నీరుగారుతున్న హరిత లక్ష్యం

image

ఆసిఫాబాద్ జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో గత ఏడాది 40.53 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు వెచ్చించినా నిర్వహణ లోపంతో మొక్కలు పశువుల పాలవుతున్నాయి. సామాజిక తనిఖీల్లో ఈ అంశంపై చర్చ జరిగినా అధికారుల తీరులో మార్పు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రతి మొక్కను సంరక్షించినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.

News February 28, 2026

VZM: యాక్సిడెంట్.. ఆర్మీ మాజీ ఉద్యోగి మృతి

image

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. గజపతినగరం మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ ఉద్యోగి గోపాలరావు కొంత కాలంగా విశాఖలో నివాసం ఉంటున్నారు. BHV సమీపంలో గోపాలరావు ప్రయాణిస్తున్న స్కూటీని GVMC లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News February 28, 2026

తూ.గో: పొట్టకూటి కోసం వెళ్తూ.. మృత్యవాత

image

తూ.గో. జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై లారీ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గజపతినగరం(M) పాతబగ్గానికి చెందిన కొందరు సభ్యులు కృష్ణాజిల్లా గుడివాడ మినప చేలు తీత కోసం బయలుదేరి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్ర మత్తులో ఉండగా లారీ వెనక డోర్ పైనుంచి జారిపడి తలకు దెబ్బ తగిలి సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.