News October 16, 2024

GREAT.. కరీంనగర్: చదువు నేర్పిన బడికే పంతులుగా

image

తాను విద్యా బుద్ధులు నేర్చుకున్న బడిలోనే ఓ వ్యక్తి పంతులుగా చేరాడు. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం జగదేవ్‌పేట గ్రామానికి చెందిన ఎండీ రఫిక్ స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 2007-08లో పదో తరగతి వరకు విద్యనభ్యసించాడు. కాగా, తాజా డీఏస్సీలో కొలువు సాధించి, పోస్టింగ్‌లో తాను చదివిన పాఠశాలలోనే హిందీ పండిట్‌గా చేరనున్నాడు. ఈ సందర్భంగా రఫిక్ తన సంతోషాన్ని ‘Way2News’తో పంచుకున్నాడు.

Similar News

News February 19, 2026

KNR: ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ (2026-27) ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు ఎం. నాగేశ్వర్ తెలిపారు. అర్హత గల పాఠశాలలు తమ దరఖాస్తులను మార్చి 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా కార్యాలయంలో సమర్పించాలి. ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం రెసిడెన్షియల్ కింద రూ.42,000, నాన్-రెసిడెన్షియల్ కింద రూ.28,000 చెల్లిస్తారు.

News February 19, 2026

కరీంనగర్: చెక్ డ్యామ్‌ల వద్ద ఇసుక తవ్వకాలు నిషిద్ధం

image

నదులపై ఉన్న చెక్ డ్యామ్‌ల రక్షణ దృష్ట్యా వాటికి ఎగువ, దిగువన 300 మీటర్ల మేర ఇసుక తవ్వకాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం‌తో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో ఇసుక నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 18, 2026

వీణవంక జాతర ఘటనపై డీజీపీకి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు

image

వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసుల ప్రవర్తనపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీ నారాయణ, కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై డీజీపీ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.