News April 14, 2024
GREAT.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్తో అంబేడ్కర్ చిత్రం

అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగంలోని 448 ఆర్టికల్స్తో గీసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటం విశేషంగా ఆకట్టుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెనికేరుకు చెందిన యార్లగడ్డ రాజారావు రాజ్యాంగంలోని 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 విభాగాలు, 128 సవరణలతో అంబేడ్కర్ చిత్రపటం రూపొందించారు. ఈ చిత్రపటాన్ని 2 రోజుల 11గంటల వ్యవధిలో గీసినట్లు రాజారావు చెప్పారు. రాజారావును పలువురు అభినందించారు.
Similar News
News October 7, 2025
ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకతకు కృషి: జేసీ

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) మరింత పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నాయని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 871 చౌకధరల దుకాణాలు సక్రమంగా పనిచేస్తున్నాయన్నారు. రేషన్ కార్డుదారులకు 93% నుంచి 94% వరకు నిత్యావసర వస్తువులు సమయానికి సరఫరా అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
News October 6, 2025
నవోదయం 2.0 సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నాటుసారా తయారు చేసినా, రవాణా చేసినా, అమ్మకాలు జరిపినా వెంటనే కాల్ సెంటర్ 14405 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా. కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్, జిల్లా అధికారుల సమీక్షలో ఆమె ఈ విషయం చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు.
News October 6, 2025
పోలీస్ పీజీఆర్ఎస్కు 25 పిర్యాదులు: ఎస్పీ

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ (ప్రజావాణి) కార్యక్రమానికి 25 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి కష్టాలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, న్యాయం చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్పీలు ఎన్బిఎం మురళీకృష్ణ, సుబ్బారాయుడు పాల్గొన్నారు.