News March 20, 2024

GREAT.. KNR: ఇద్దరికి ప్రతిభా, ఐదుగురికి కీర్తి పురస్కారాలు

image

ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించిన అవార్డులకు ఉమ్మడి KNR జిల్లాకు చెందిన ఐదుగురు కీర్తి, ఇద్దరు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈమేరకు HYDలో ఈనెల 20, 21న కీర్తి పురస్కారాలు, 28న ప్రతిభా పురస్కారాలను అందుకోనున్నారు. అన్నవరం శ్రీనివాస్, గండ్ర లక్ష్మణ్ రావుకు ప్రతిభా పురస్కారం లభించగా.. మధుసూదన్ రెడ్డి, గోపాల్, సేనాధిపతి, శ్రీనివాస రాజు, సంతొశ్ బాబుకు కీర్తి అవార్డులు లభించాయి.

Similar News

News October 15, 2025

ఆర్డీవో నివేదిక జాప్యంపై కరీంనగర్ కలెక్టర్‌కు ఫిర్యాదు

image

135 రోజుల తర్వాత కూడా తన ఫిర్యాదుపై తుది నివేదిక ఇవ్వకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 23న ప్రజావాణిలో ఫేక్ సర్టిఫికెట్తో జాబ్ చేస్తున్నాడని వీఆర్ఏపై ఫిర్యాదు చేసిన బాధితుడికి, కలెక్టర్ 2025 ఏప్రిల్ 25న హుజురాబాద్ ఆర్‌డిఓను 15రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్‌డీఓ మూడు సార్లు నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్ 12న విచారణ పూర్తి చేసిన తుది నివేదిక అందించలేదని వాపోయాడు.

News October 15, 2025

KNR: నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమం

image

స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ డా.వరలక్ష్మి అధ్యక్షతన భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.‌ ఈ సమావేశంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్లు డా.మొగిలి, డా.లక్ష్మణరావు, పెద్ది స్వరూప, డా.స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

News October 15, 2025

KNR: బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన సదస్సు

image

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కరీంనగర్ హెల్త్ క్లబ్, రెడ్డీస్ లాబరేటరీ ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ డా.డి.వరలక్ష్మి అధ్యక్షతన, డాక్టర్ ఎం. ప్రతిష్ఠ రావు Reproduction concern Grenz, మహిళలలో వచ్చే Breast Cancer, PCDD పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ క్లబ్ కో ఆర్డినేటర్ డా. నజియా, జె.రజిత, డి.స్వరూప రాణి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.