News February 6, 2025
GREAT: పండ్లు అమ్ముతూ జీవనం.. వచ్చిన లాభంతో అన్నదానం!

కేరళలోని త్రిసూర్లో జేసన్ పాల్ అనే వ్యక్తి పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అయినప్పటికీ ఆయన తనకొచ్చిన లాభంలో అధిక మొత్తాన్ని పేదల ఆకలి తీర్చేందుకు వెచ్చిస్తున్నారు. ఆయన వారంలో ఆరు రోజులు 100 నుంచి 150 మంది పేదలకు భోజనం అందిస్తున్నారు. పట్టలం రోడ్డులో రోజూ మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు ఏర్పాటు చేసి భోజనం పెడుతున్నారు. అన్నార్తుల ఆకలి తీర్చుతున్న జేసన్ పాల్ గొప్ప మనసును అభినందించాల్సిందే.
Similar News
News April 4, 2026
ఎల్లోతో ప్రేమలో పడిపోయా.. మీనా ఫొటో వైరల్

తొలిసారి ప్రత్యక్షంగా క్రికెట్ మ్యాచ్ వీక్షించినట్లు నటి మీనా తెలిపారు. నిన్న CSK-PBKS మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో దిగిన ఫొటోను Xలో షేర్ చేశారు. ‘తొలిసారి లైవ్ చూశా. ఎల్లో(CSK)తో లవ్లో పడిపోయా’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఎప్పటికీ తరగని అందం ఆమెదని కొందరు కామెంట్ చేయగా, CSKలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటూ మరికొందరు ఆరా తీశారు. 90sలో వెలుగు వెలిగిన మీనా సెకండ్ ఇన్నింగ్స్లో ‘దృశ్యం’తో అదరగొట్టారు.
News April 4, 2026
భారతీయుల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తాం: పాక్

పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్పై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే భారతీయుల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తామని ప్రగల్భాలు పలికారు. ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బను మర్చిపోయి ఆయన ఇలా మాట్లాడటం గమనార్హం. పశ్చిమాసియా ఉద్రిక్తతల సాకుతో పాక్ ఏ చిన్న తప్పు చేసినా గట్టిగా బుద్ధి చెబుతామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల పాక్కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News April 4, 2026
సూపర్ నేపియర్ గడ్డిని ఎలా పెంచాలి?

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.


