News August 14, 2024
గ్రేట్.. తెలంగాణ నుంచి ఒక్కరే!

విధి నిర్వహణలో ధైర్యసాహసాలు కనబరిచిన తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య ‘గ్యాలంట్రీ ప్రెసిడెంట్ మెడల్’కు ఎంపికయ్యారు. 2022లో కేసు విచారణలో చైన్ స్నాచర్లు యాదయ్యపై కత్తితో దాడి చేశారు. కత్తిపోట్లకు గురైనా వారిని నిలువరించి పట్టుకునేందుకు ఆయన ప్రయత్నించారు. రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపికైన ఏకైక పోలీస్ అధికారిగా నిలిచిన యాదయ్యని డీజీపీ జితేందర్ సన్మానించారు.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


