News April 11, 2025
GREAT: సో‘హిట్’ కావాలి

MPలోని జబల్పూర్కు చెందిన 11ఏళ్ల ఆర్చర్ సోహిత్ కుమార్ అండర్-15 జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్లో 720 పాయింట్లకు 710 పాయింట్లు సాధించి నేషనల్ రికార్డు సృష్టించారు. ఆయన తండ్రికి ఓ కాలు లేదు. చేతికర్రలు, తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి కష్టాలను అధిగమిస్తుంటే, ఆ కష్టానికి ప్రతిఫలంగా సోహిత్ ఆర్చరీలో రికార్డులు నెలకొల్పుతున్నారు. 2028ఒలింపిక్స్ లక్ష్యం అంటున్నారు.
Similar News
News November 24, 2025
ప్రజల నుంచి 450 అర్జీల స్వీకరణ: అనంత కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం కలెక్టరేట్లోని PGRS కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి 450 అర్జీలను స్వీకరించామని తెలిపారు. PGRS అర్జీలను నాణ్యతగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని అన్నారు.
News November 24, 2025
ఐబొమ్మ రవి సంపాదన రూ.100 కోట్లు?

మూవీల పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్తో ఐబొమ్మ <<18377140>>రవి<<>> రూ.100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ను సేకరించినట్లు సమాచారం. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్కు లింక్ అయ్యేలా వెబ్సైట్లో ఏర్పాటు చేశాడని గుర్తించారు. మరోవైపు ఈ విచారణపై రేపు ప్రెస్మీట్లో సజ్జనార్ వివరాలను వెల్లడిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
News November 24, 2025
అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

TG: పటాన్చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.


