News February 5, 2025

గ్రేట్.. ఈ డాక్టర్ ఫీజు రూ.10 మాత్రమే

image

జబ్బుపడి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ ఫీజు రూ.500పైమాటే. కానీ, రూ.10 మాత్రమే ఫీజుగా తీసుకుంటూ పేదలకు వైద్య సేవలందిస్తున్నారు పట్నాకు చెందిన డాక్టర్ ఎజాజ్ అలీ. 40 ఏళ్లుగా రూ.10 తీసుకొని రోగులకు అత్యున్నత చికిత్స అందించేందుకే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన అందించిన సరసమైన చికిత్స లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేసింది. ఆరోగ్య సంరక్షణలో ఎజాజ్ చేసే నిస్వార్థ సేవను అభినందించాల్సిందే.

Similar News

News March 18, 2026

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. అల్లూరి, పోలవరం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. కాగా ఇప్పటికే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఆకాశాన్ని మబ్బులు కమ్మేయగా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ వర్షం పడుతోంది.

News March 18, 2026

ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

image

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 18, 2026

ఇదేంటి భయ్యా.. రోజూ రేట్ పెంచుతున్నారు?

image

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న, జాబ్ చేస్తూ రూముల్లో ఉంటున్న బ్యాచిలర్లు అంటున్న మాటలివి. LPG కొరతతో పలు హోటళ్లు క్లోజింగ్ బోర్డులు పెట్టగా.. మరికొన్ని టిఫిన్లు, కర్రీలపై 2-3 రోజులకు రూ.5 పెరుగుతోందని వాపోతున్నారు. గ్యాస్ కొరత నిజమే అయినా రోజూ దాన్ని సాకుగా చూపుతూ ధరలు పెంచడం కరెక్ట్ కాదంటున్నారు. గత 10 రోజుల్లో వీటిపై రూ.15 వరకు పెంచినట్లు చెబుతున్నారు. మీ ఏరియాలో ఎలా ఉంది?