News October 19, 2024

గ్రేట్.. చెట్లను కాపాడేందుకు రెండేళ్లు పోరాటం!

image

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జులియా హిల్ పర్యావరణ పరిరక్షకురాలు. 1997లో ఓ కంపెనీ చైర్ల తయారీ కోసం వెయ్యేళ్ల భారీ వృక్షాలను తొలగించేందుకు సిద్ధమైంది. దీంతో జులియా ఓ వృక్షంపైకి ఎక్కి 200 ఫీట్ల ఎత్తులో నిరసన తెలిపారు. చలి, కుండపోత వర్షాలను ఎదుర్కొని 738 రోజులు దిగకుండా చెట్టుపైనే ఉండిపోయారు. కంపెనీ వెనకడుగేయడంతో ఆమె తన పోరాటంలో విజయం సాధించారు. కొన్నిరోజుల్లోకే ఆ కంపెనీ దివాలా తీసింది.

Similar News

News January 21, 2026

అక్రమాలకు కేంద్రంగా సింగరేణి: కిషన్‌రెడ్డి

image

TG: అవినీతి, అక్రమాలకు సింగరేణి కేంద్రంగా మారిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. BRS, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతులా వాడుకున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బొగ్గు అందించాలనే నైనీ కోల్‌బ్లాక్‌ను కేంద్రం కేటాయించిందన్నారు. కేంద్రం అనుమతులిచ్చినా టెండర్లు పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, సింగరేణి అక్రమాలపై CBI విచారణ అవసరమని తెలిపారు.

News January 21, 2026

1.12 కోట్ల ఉద్యోగాలిచ్చేలా MSMEలకు కేంద్ర ప్రోత్సాహం

image

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంటు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ₹5,000 CR EQUITY సపోర్టుగా ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. MSMEలకు రుణ ప్రోత్సాహంగా దీన్ని అమలు చేయనుంది. దీని ద్వారా 25.74 L సంస్థలకు లబ్ధి చేకూరి 1.12 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. కాగా <<18915747>>అటల్ పెన్షన్<<>> యోజన స్కీమ్‌ను 2030–31 వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

News January 21, 2026

తెలంగాణలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

image

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. 36 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఈసీ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో ఉన్నవారిని, ఒకే చోట మూడేళ్లు దాటిన వారిని మార్చేసింది. ప్రమోషన్లు, పరిపాలనా కారణాలతో జరిగిన ఈ బదిలీల్లో పలువురిని జీహెచ్‌ఎంసీకి పంపగా మరికొందరిని జిల్లాలకు బదిలీ చేసింది.