News July 19, 2024
పాకిస్థాన్పై భారత్ ఘన విజయం

మహిళల ఆసియా కప్ T20 టోర్నీలో భాగంగా గ్రూప్-A తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాక్పై భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మంధాన(45), షఫాలీ వర్మ(40) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. దీప్తి శర్మ 3, రేణుకా, పూజా, శ్రేయాంకా రెండేసి వికెట్లు పడగొట్టారు.
Similar News
News November 18, 2025
ఎనామలీ స్కాన్ ఎందుకంటే?

ప్రెగ్నెన్సీలో 20వారాల తర్వాత ఎనామలీ స్కాన్ చేయించాలని వైద్యులు సూచిస్తారు. మీ గర్భంలో పెరుగుతున్న బేబీ అవయవాల ఆకృతిని ఈ పరీక్ష విశ్లేషిస్తుంది. క్లెఫ్ట్ లిప్(పెదాల చీలిక), స్పైనా బైఫైడా (వెన్నుముక సరైన ఆకృతికి రాకపోవడం), ఎడ్వర్డ్ సిండ్రోమ్ (అదనపు క్రోమోజోమ్స్ ఉండడం), కంజెషనల్ హార్ట్ డిసీజ్(CHD) వంటివి ఇందులో తెలుస్తాయి. అంతర్గత అవయవాల ఎదుగుదలను కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఈ టెస్ట్ తప్పనిసరి.
News November 18, 2025
ఎనామలీ స్కాన్ ఎందుకంటే?

ప్రెగ్నెన్సీలో 20వారాల తర్వాత ఎనామలీ స్కాన్ చేయించాలని వైద్యులు సూచిస్తారు. మీ గర్భంలో పెరుగుతున్న బేబీ అవయవాల ఆకృతిని ఈ పరీక్ష విశ్లేషిస్తుంది. క్లెఫ్ట్ లిప్(పెదాల చీలిక), స్పైనా బైఫైడా (వెన్నుముక సరైన ఆకృతికి రాకపోవడం), ఎడ్వర్డ్ సిండ్రోమ్ (అదనపు క్రోమోజోమ్స్ ఉండడం), కంజెషనల్ హార్ట్ డిసీజ్(CHD) వంటివి ఇందులో తెలుస్తాయి. అంతర్గత అవయవాల ఎదుగుదలను కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఈ టెస్ట్ తప్పనిసరి.
News November 18, 2025
గుండెలను పిండేసే ఘటన.. 3 తరాలు బూడిద

సౌదీ బస్సు ప్రమాదంలో HYDకు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలో <<18312045>>18<<>> మంది మరణించడంతో అతడి తల్లి రోషన్ గుండెలు బాదుకుంటున్నారు. చివరి చూపులకూ నోచుకోలేకపోతున్నామని, అల్లా ఎంత పని చేశాడని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ కుటుంబంలోని 8 మంది పెద్దలు, 10 మంది పిల్లలు మరణించారు. నసీర్ పెద్దకుమారుడు సిరాజుద్దీన్ USలో ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. ఆ కుటుంబంలో 3 తరాలు బూడిదైపోయాయి.


