News July 7, 2024
పసిడి పరుగులు.. ఇన్వెస్టర్లకు లాభాలు

బంగారంపై పెట్టుబడితో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండుతోంది. జనవరి-జూన్లో నిఫ్టీ 11% లాభపడితే.. పసిడి 14% ఆదాయాన్ని అందించింది. పెద్ద దేశాలు బ్యాంకుల నుంచి గోల్డ్ను కొనుగోలు చేస్తుండటం, అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడిని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.74వేలు ఉండగా, త్వరలోనే రూ.78వేలకు చేరే అవకాశం ఉందని నిపుణుల అంచనా.
Similar News
News January 27, 2026
కరువుకు మామిళ్లు, కాలానికి నేరేళ్లు

సాధారణంగా వర్షాలు సరిగా కురవక, ఎండలు ఎక్కువగా ఉండి కరవు పరిస్థితులు ఉన్నప్పుడు మామిడి చెట్లు విపరీతంగా కాస్తాయి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ మామిడి పండ్ల దిగుబడి, తీపి పెరుగుతాయి. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి, వాతావరణం చల్లబడినప్పుడు నేరేడు పండ్లు పుష్కలం వస్తాయి. కరవు సమయంలో ఆహారం కోసం మామిడి పండ్లను, వానాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లను ప్రకృతి మనకు ప్రసాదిస్తుందని ఈ సామెత అర్థం.
News January 27, 2026
రామకృష్ణ తీర్థం వెనకున్న పురాణ గాథ

స్కంద పురాణం ప్రకారం.. పూర్వం రామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రి పర్వతాలపై కఠోర తపస్సు చేశారు. నిత్య స్నానాదుల కోసం ఈ తీర్థాన్ని నిర్మించుకున్నారు. అక్కడే నివసిస్తూ మహావిష్ణువును ధ్యానించారు. మహర్షి భక్తికి మెచ్చిన స్వామివారు ప్రత్యక్షమై ఆయనకు ముక్తిని ప్రసాదించారు. అందుకే ఈ తీర్థానికి ఆయన పేరొచ్చింది. ఈ ప్రదేశంలో రాముడు, కృష్ణుడి విగ్రహాలుంటాయి. అందుకే దీన్ని ‘రామకృష్ణ తీర్థం’ అంటారని మరో గాథ.
News January 27, 2026
రామకృష్ణ తీర్థం ఎక్కడ, ఎలా ఉంటుందంటే..

రామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 10km దూరంలో ఉంటుంది. దట్టమైన శేషాచల అడవుల మధ్య ఉండే ఈ తీర్థాన్ని పవిత్రంగా కొలుస్తారు. యాత్రికులు ముందుగా తిరుమల నుంచి బస్సు/సొంత వాహనాల్లో పాపవినాశనం చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 6KM దూరంలో ఈ తీర్థం ఉంటుంది. రాళ్లు, రప్పలు, నీటి వాగుల గుండా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే ఈ పవిత్ర తీర్థం వస్తుంది. ఇది ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా, అతి రమణీయంగా ఉంటుంది.


