News July 7, 2024

పసిడి పరుగులు.. ఇన్వెస్టర్లకు లాభాలు

image

బంగారంపై పెట్టుబడితో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండుతోంది. జనవరి-జూన్‌లో నిఫ్టీ 11% లాభపడితే.. పసిడి 14% ఆదాయాన్ని అందించింది. పెద్ద దేశాలు బ్యాంకుల నుంచి గోల్డ్‌ను కొనుగోలు చేస్తుండటం, అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడిని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.74వేలు ఉండగా, త్వరలోనే రూ.78వేలకు చేరే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

Similar News

News November 27, 2025

ఆ రహదారిపై ప్రమాదాలు ఎక్కువ: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదం వలన సంభవించే మరణాల వలన ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఎస్పీ ఉమామహేశ్వర్ బుధవారం తెలిపారు. జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్, ఆర్టీవో, ఆర్అండ్‌బీ, హైవే అధికారులు సంయుక్త కార్యచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పరిధిలో ప్రధానంగా నామ్ హైవే, హైవే నంబర్ 16, 216లపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.

News November 27, 2025

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు.. రేపు విచారణ
*SAతో టెస్ట్ సిరీస్‌లో IND ఘోర ఓటమి.. 2-0తో వైట్‌వాష్
*AP: మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే: పవన్ కళ్యాణ్‌
*రేవంత్ రూ.50వేల కోట్ల పవర్ స్కాం: హరీశ్‌
*APలో స్టూడెంట్ అసెంబ్లీ.. ప్రశ్నలు, వివరణలతో ఆకట్టుకున్నవిద్యార్థులు
*బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రేపటికి వాయుగుండంగా మారవచ్చన్న APSDMA

News November 27, 2025

కుళ్లిన పండ్లను తీసుకుని.. : అంధుల క్రికెట్ కెప్టెన్ కన్నీళ్లు

image

మహిళల అంధుల క్రికెట్ <<18367663>>ప్రపంచకప్‌ను<<>> ఇటీవల ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కెప్టెన్ దీపిక ఎమోషనల్ అయ్యారు. ‘జనం విసిరేసే కుళ్లిన పండ్లలో చెడు భాగాన్ని తీసేసి మిగతాది నేను, నా తోబుట్టువులు తినేవాళ్లం. మా ఇంట్లోనే కాదు ప్రతి ప్లేయర్‌ ఇంట్లో రోజుకు ఒకపూట భోజనం దొరకడం కూడా కష్టం. ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.