News August 28, 2024
2,280 టెంపరరీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

TG: జూనియర్ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,654 గెస్ట్, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ లెక్చరర్ల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025, మార్చి 31 వరకు కాలేజీల్లో బోధించేందుకు ఇంటర్ కమిషనరేట్ ఈ నియామకాలు చేపట్టనుంది.
Similar News
News February 16, 2026
ఏపీఎంఐపీ ఆటోమేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

రైతులు ఏపీఎంఐపీ ఆటోమేషన్ పథకాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో పథక పోస్టర్లను ఆవిష్కరించారు. సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థల ఆటోమేషన్కు హెక్టారుకు రూ.40,000 సూచిక వ్యయంపై సబ్సిడీ అందుతుందని తెలిపారు. నీటి వృథా తగ్గించి, అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. రైతు సేవా కేంద్రం లేదా ఉద్యానవన కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 16, 2026
TG: 7 కార్పొరేషన్లలో మేయర్, డి.మేయర్లు వీరే

⋆ కరీంనగర్: మేయర్-శ్రీనివాస్ (BJP), డిప్యూటీ మేయర్-సునీల్ రావు(BJP)
⋆ NZB: ఉమారాణి (కాంగ్రెస్), తహసీన్(MIM)
⋆ రామగుండం: మహంకాళి స్వామి(INC), పాతిపెల్లి ఎల్లయ్య(INC)
⋆ కొత్తగూడెం: మూడ్ గణేశ్(CPI), సిరిపురపు లలిత కుమారి (INC)
⋆ NLG: చైతన్య శ్రీనివాసరెడ్డి(INC), మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్(INC)
⋆ MBNR: గుమల్ మమత(INC), సురేందర్ రెడ్డి(INC)
⋆ మంచిర్యాల: మధుకర్ (INC), రమ్య మహేశ్(INC)
News February 16, 2026
టెన్త్లో రెండు బోర్డు ఎగ్జామ్స్పై CBSE క్లారిటీ

పదో తరగతిలో రెండు బోర్డు ఎగ్జామ్ల పాలసీపై CBSE స్పష్టతనిచ్చింది. విద్యార్థులందరూ మొదటి బోర్డు పరీక్షలు రాయడం తప్పనిసరి అని పేర్కొంది. మొదటి బోర్డు పరీక్షల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరు కాకపోతే రెండో బోర్డు పరీక్షలకు అనర్హులని తెలిపింది. ఇంప్రూవ్మెంట్, మొదటి బోర్డు పరీక్షల్లో ఫెయిలైన వారి కోసం మాత్రమే సెకండ్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వివరించింది.


