News August 28, 2024

2,280 టెంపరరీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

image

TG: జూనియర్ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,654 గెస్ట్, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ లెక్చరర్ల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025, మార్చి 31 వరకు కాలేజీల్లో బోధించేందుకు ఇంటర్ కమిషనరేట్ ఈ నియామకాలు చేపట్టనుంది.

Similar News

News February 23, 2026

తొలిరోజు 635 మంది గైర్హాజరు: ఆర్ఐఓ

image

అనంతపురం జిల్లాలోని 64 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐఓ రమణ నాయక్ తెలిపారు. జిల్లాలో 22,848 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 22,213 మంది రాశారని చెప్పారు. వివిధ కారణాలతో 635 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వివరించారు.

News February 23, 2026

కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు: CM

image

AP: రాజమండ్రి కల్తీ పాల <<19215623>>ఘటన<<>> బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. నలుగురు చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. 8 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. పాల వ్యాపారి గణేశ్వరరావును అరెస్ట్ చేశామని, బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపామన్నారు.

News February 23, 2026

225 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>ESI <<>>కార్పొరేషన్‌లో 225 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి గడువును పెంచారు. మార్చి 3వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. UPSC నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2024కు సంబంధించి ప్రతిభా సేతు పోర్టల్ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పే స్కేల్ రూ.56,100-రూ.1,77,500 ఉంది. వెబ్‌సైట్: https://esic.gov.in