News March 21, 2024
గృహ జ్యోతి పథకం.. వారి కోసం ప్రత్యేక కౌంటర్లు

TG: గృహాజ్యోతి పథకానికి అర్హులై ఉండి, జీరో బిల్లు రాని వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎంపీడీవో, మున్సిపల్, జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసుల్లో ఈ స్పెషల్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన వారు తమ వివరాలను సరిచేసుకోవాలని సూచించింది. ఈ పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News September 10, 2025
నేడే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’

AP: సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని TDP, JSP, BJP తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఇవాళ అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరిట కార్యక్రమం జరగనుంది. CM చంద్రబాబు, Dy.CM పవన్, BJP రాష్ట్రాధ్యక్షుడు మాధవ్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.
News September 10, 2025
నిన్న బంగ్లా, నేడు నేపాల్.. ప్రజలు తలచుకుంటే అంతే..

ప్రజలు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయనడానికి మరో నిదర్శనం నేపాల్. తీవ్ర అవినీతి, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు SMపై బ్యాన్ విధించడంతో నేపాలీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నుకున్న నేతలనే రోడ్లపై తన్నుకుంటూ తరిమికొట్టారు. PM కేపీ ఓలీ దుబాయ్ పారిపోయారు. గతేడాది సరిగ్గా ఇలాంటి పరిస్థితులే బంగ్లాలోనూ కనిపించాయి. ప్రజల తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆమె పారిపోయి INDకు వచ్చేశారు.
News September 10, 2025
అక్టోబర్ 2న ‘రాజాసాబ్’ ట్రైలర్: నిర్మాత

అక్టోబర్ 2న విడుదలయ్యే ‘కాంతార: చాప్టర్-1’ సినిమాతో ‘రాజాసాబ్’ ట్రైలర్ను విడుదల చేస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు. ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్లలోకి రానుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’ ఈనెల 12న విడుదలవుతోంది.