News April 7, 2025
చెప్పులు దాస్తే ₹5వేలే ఇచ్చాడని వరుడిపై కర్రలతో దాడి..

కొన్ని ప్రాంతాల్లో వివాహాల్లో వరుడి చెప్పులను దాచి కట్నం తీసుకోవడం ఆచారం. UP బిజ్నోర్లో ఓ వరుడిని ₹50వేలు డిమాండ్ చేశారు. అతడు ₹5వేలు ఇవ్వడంతో గొడవ జరిగింది. తక్కువ డబ్బు ఇచ్చినందుకు వధువు వైపు మహిళలు వరుడిని ‘బిచ్చగాడు’ అని తిట్టడంతో ఇరు కుటుంబాలు దాడి చేసుకున్నాయి. దీంతో వధువు కుటుంబం (బావమరుదులు) వరుడిని రూమ్లో బంధించి కర్రలతో కొట్టింది. పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరింది.
Similar News
News October 21, 2025
రేపటి నుంచే కార్తీక మాసం

ఇవాళ్టితో ఆశ్వయుజ మాసం ముగిస్తుంది. రేపటి(OCT 22) నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ 20 వరకు కొనసాగుతుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని స్కంద పురాణంలో పేర్కొన్నారు. ఉదయం, సాయంత్ర వేళల్లో దీపాలు వెలిగిస్తూ, పూజలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు, వనభోజనాలతో ఈ మాసమంతా భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది.
News October 21, 2025
133M మంది బాలికలు బడికి దూరం!

లింగ సమానత్వంపై ఎన్ని చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా 133 మిలియన్ల బాలికలు చదువుకు దూరంగా ఉన్నట్లు గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ (UNSCO) పేర్కొంది. ప్రస్తుతం ప్రైమరీలో 91M, సెకండరీలో 136M మంది బాలికలు నమోదయ్యారు. ఉన్నతవిద్యలో వారి చేరిక 3రెట్లు పెరిగింది. అయితే బీజింగ్ డిక్లరేషన్(1995) మహిళలకు సమానావకాశాలపై తీర్మానించి 3 దశాబ్దాలు దాటుతున్నా అవుట్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ అధికంగానే ఉన్నారని GEM తెలిపింది.
News October 21, 2025
ఏపీ, టీజీ న్యూస్ రౌండప్

* మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి: TG సీఎం రేవంత్
* నవంబర్ 7న ఏపీ క్యాబినెట్ భేటీ
* ఖైరతాబాద్, శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాలను సందర్శించిన కేటీఆర్, హరీశ్ రావు
* నారా నరకాసుర పాలన పోవాలి.. జగనన్న పాలన రావాలి: రోజా
* హైదరాబాద్లో బాణసంచా కాలుస్తూ 70 మందికి గాయాలు