News October 26, 2024
గ్రూప్-1: మరో అభ్యర్థి డిబార్

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడిన అభ్యర్థిని ఎగ్జామినర్లు డిబార్ చేశారు. హైదరాబాద్లోని నారాయణమ్మ కాలేజీలో చిట్టీలు తీసుకొచ్చి రాస్తున్నట్లుగా గుర్తించారు. నిన్న సీవీఆర్ కాలేజీలో ఓ అభ్యర్థిని డిబార్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ పరీక్షకు 21,181 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాజరు శాతం 67.4గా నమోదైంది. రేపటితో మెయిన్స్ పరీక్షలు ముగియనున్నాయి.
Similar News
News January 3, 2026
పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.
News January 3, 2026
ఇతిహాసాలు క్విజ్ – 116

ఈరోజు ప్రశ్న: వాల్మీకీ కన్నా ముందే రామాయణంలో ఒకరు రామాయణాన్ని రాశారు. అది ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 3, 2026
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు (<


