News October 26, 2024

గ్రూప్-1: మరో అభ్యర్థి డిబార్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన అభ్యర్థిని ఎగ్జామినర్లు డిబార్ చేశారు. హైదరాబాద్‌లోని నారాయణమ్మ కాలేజీలో చిట్టీలు తీసుకొచ్చి రాస్తున్నట్లుగా గుర్తించారు. నిన్న సీవీఆర్ కాలేజీలో ఓ అభ్యర్థిని డిబార్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ పరీక్షకు 21,181 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాజరు శాతం 67.4గా నమోదైంది. రేపటితో మెయిన్స్ పరీక్షలు ముగియనున్నాయి.

Similar News

News January 7, 2026

తల్లి వాడే పర్ఫ్యూమ్‌ వల్ల బిడ్డ విలవిలలాడింది!

image

వైద్యశాస్త్రానికే సవాలు విసిరిన ఓ వింత కేసు MH పుణేలో జరిగింది. ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి 8 నెలల పాటు ఎడతెరిపి లేని దగ్గుతో విలవిలలాడింది. వైద్యులు మందులు మార్చినా తగ్గలేదు. కానీ ఒక నర్సు సూక్ష్మ పరిశీలన అద్భుతాన్ని చేసింది. ఆ తల్లి పర్ఫ్యూమ్ వల్లే బిడ్డ దగ్గుతోందని ఆమె గుర్తించింది. దానిని వాడటం మానేయగానే పాప కోలుకుంది. కొన్నిసార్లు మనం వాడే వస్తువులే పిల్లలను ఇబ్బందిపెడతాయని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

News January 7, 2026

భారత్ మాకు విలువైన భాగస్వామి.. మోదీ ట్వీట్‌కు నెతన్యాహు రిప్లై

image

భారత్-ఇజ్రాయెల్ ప్రధానులు మోదీ, నెతన్యాహు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు నూతన ఏడాది శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ప్రాంతీయ పరిస్థితుల గురించి చర్చించామని మోదీ తెలిపారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని ట్వీట్ చేశారు. ‘భారతదేశంతో ఉన్న లోతైన భాగస్వామ్యాన్ని ఇజ్రాయెల్ విలువైనదిగా భావిస్తుంది. కలిసి ఉగ్రవాదాన్ని ఓడిద్దాం’ అని నెతన్యాహు రిప్లై ఇచ్చారు.

News January 7, 2026

H-1B వీసా ప్రోగ్రామ్ రద్దు కోరుతూ బిల్

image

విదేశీయులు USలో ఉద్యోగాలు చేయడానికి వీలుగా ఉన్న H-1B వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని రిపబ్లికన్ నేత మార్జోరీ టైలర్ గ్రీన్ హౌస్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. H-1B వీసాతో పాటు అమెరికా పౌరుల ప్రయోజనాలకు ఇమిగ్రేషన్‌ యాక్ట్‌లో పలు మార్పులను బిల్లులో ప్రతిపాదించారు. అయితే బిల్లు పెట్టి కాసేపటికే ఆమె రిజైన్ చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ బయటకు రావడంతోపాటు పలు వివాదాల్లో చిక్కుకున్నారు.