News March 18, 2024
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు: నెల్లూరు జేసీ

జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. ఆదివారం ఉదయం గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు ఆరోగ్య రాణి, సునీతతో కలిసి పరిశీలించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు.
Similar News
News November 2, 2025
మైపాడు బీచ్లో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మృతి

మైపాడు బీచ్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. బీచ్లో స్నానానికి దిగి ఇంటర్ విద్యార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హుమయూన్, తాజిన్, ఆదిల్గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 2, 2025
గొలగముడి: లడ్డూ కౌంటర్ 10 గంటలకు ముందే క్లోజ్

వెంకటాచలం మండలం గొలగముడి వెంకయ్య స్వామి గుడికి జిల్లాలోనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడకు ఒక్క శనివారమే సుమారు 10 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ భక్తులు ఎంతో భక్తితో తీసుకొనే లడ్డూ ప్రసాదం అందరికి అందడం లేదు. కనీసం రాత్రి 10 గంటలు కాకముందే కౌంటర్ మూసేశారు. దీంతో భక్తులు ప్రసాదం తీసుకోకుండానే నిరాశ చెందుతున్నారు. పలుమార్లు ఇలానే జరుగుతుందని భక్తులు వాపోతున్నారు.
News November 2, 2025
NLR: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు

నెల్లూరు జిల్లాలోని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు రెండు రోజులుగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. BNS168 సెక్షన్ ప్రకారం సూచనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. గ్రూప్ పేరు, మొబైల్ నంబర్స్, గ్రూప్ సభ్యుల సంఖ్య, గ్రూప్ దేని కోసం వాడుతున్నారు? అనే వివరాలను పోలీసు స్టేషన్లో అందజేయాలంటున్నారు. గ్రూపులో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ బాధ్యత అడ్మిన్లదేనని నోటిసుల్లో స్పష్టం చేస్తున్నారు.


