News March 18, 2024

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు: నెల్లూరు జేసీ

image

జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. ఆదివారం ఉదయం గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు ఆరోగ్య రాణి, సునీతతో కలిసి పరిశీలించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు.

Similar News

News January 23, 2026

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి: కలెక్టర్

image

అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగుల అందరి చేత జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల నమోదు పెంచడం, ఓటు హక్కుపై అవగాహన కల్పించడం, యువతను ఓటరుగా నమోదుకై ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.

News January 23, 2026

కందుకూరు LICలో రూ.3 కోట్లు స్కాం

image

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్‌గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.కోట్లు కాజేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని సమాచారం. ప్రాథమిక విచారణలో రూ.3 కోట్లు కాజేసినట్లు తెలుస్తోంది. కొత్త సాప్ట్‌వేర్‌తో ఈ స్కాం బయటపడిందని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 23, 2026

ఎయిడెడ్ పోస్టుల భర్తీకి 25, 27న పరీక్షలు: DEO

image

గూడూరులోని SPS UP స్కూల్లో ఎయిడెడ్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు 25, 27వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను cre.ap.gov.in వెబ్సైట్ నుంచి తమ మొబైల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోలేని అభ్యర్థులు తిరుపతిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.