News October 22, 2024

గ్రూప్-1 మెయిన్స్: రెండో రోజు 69.4% హాజరు

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు రెండో రోజు 69.4% హాజరు నమోదైంది. ఇవాళ జరిగిన పేపర్-1 జనరల్ ఎస్సే పరీక్షను 21,817 మంది అభ్యర్థులు రాశారని అధికారులు ప్రకటించారు. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించగా, నిన్న తొలి రోజు 72.4% హాజరు నమోదైన సంగతి తెలిసిందే.

Similar News

News March 17, 2025

భద్రత పెంచుతాం.. డీకే అరుణకు సీఎం హామీ

image

TG: బీజేపీ ఎంపీ డీకే అరుణ <<15780375>>ఇంట్లో ఆగంతకుడు<<>> ప్రవేశించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని ఆమెకు హామీకి ఇచ్చారు. ఈ ఘటనలో విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులను సీఎం ఆదేశించారు. భద్రత పెంచాలని పోలీస్ శాఖకు సూచించారు.

News March 17, 2025

GOLD: ప్రాఫిట్ బుకింగ్ టైమ్ వచ్చేసిందా!

image

చివరి మూడేళ్లలో ఏటా బంగారం 17% రాబడి అందించింది. ఔన్స్ రేటు $3000ను తాకడంతో ప్రాఫిట్ బుక్ చేసుకోవడంపై ఇన్వెస్టర్లు సందిగ్ధంలో పడ్డారు. Sensex to Gold రేషియోను బట్టి నిర్ణయించుకోవడం బెటర్ అంటున్నారు Edelweiss SVP నిరంజన్ అవస్థి. 1999 నుంచి ఈ రేషియో 1కి దిగువన ఉంటే తర్వాతి మూడేళ్లలో ఈక్విటీస్, 1 కన్నా ఎక్కువుంటే తర్వాతి మూడేళ్లలో గోల్డ్ రాణిస్తోంది. ప్రస్తుతమిది లాంగ్‌టర్మ్ సగటు 0.96కు దిగువన ఉంది.

News March 17, 2025

మరోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి మూవీ

image

మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. మెగాస్టార్‌తో తీయబోయే మూవీ స్క్రిప్ట్ స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. సినిమా కథలకు వైజాగ్‌ను తాను సెంటిమెంట్‌గా భావిస్తానని చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!