News October 22, 2024

గ్రూప్-1 మెయిన్స్: రెండో రోజు 69.4% హాజరు

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు రెండో రోజు 69.4% హాజరు నమోదైంది. ఇవాళ జరిగిన పేపర్-1 జనరల్ ఎస్సే పరీక్షను 21,817 మంది అభ్యర్థులు రాశారని అధికారులు ప్రకటించారు. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించగా, నిన్న తొలి రోజు 72.4% హాజరు నమోదైన సంగతి తెలిసిందే.

Similar News

News October 23, 2024

వైసీపీని విమర్శించే అర్హత మీకు లేదు.. రాదు: రోజా

image

హోంమంత్రి అనితపై మాజీ మంత్రి రోజా ట్విటర్‌లో మండిపడ్డారు. ‘మీ పార్టీ ఆఫీస్‌కి 10 కి.మీ దూరంలోని గుంటూరు ఆస్పత్రిలో TDP కార్యకర్త నవీన్ హత్యాయత్నం చేసిన దళిత యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించలేవా? బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థి దస్తగిరమ్మ హత్య జరిగి 3 రోజులైంది. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలనిపించలేదా? మంత్రిగా బాధ్యతలు మరిచిన మీకు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. రాదు’ అని ట్వీట్ చేశారు.

News October 22, 2024

విలన్‌ రోల్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్!

image

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో హిందీలో ‘వార్ 2’ సినిమా తెరకెక్కుతోంది. మూవీలో ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. మొత్తం 40మందితో ఎన్టీఆర్ ఫైట్ సీక్వెన్స్‌ను ఈరోజు తెరకెక్కించినట్లు మూవీ టీమ్ తెలిపింది. ముంబైలోని యశ్‌రాజ్ స్టూడియోస్‌లో 3 రోజుల పాటు తీయనున్న ఈ ఫైట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుందని పేర్కొంది. మరికొన్ని రోజుల్లో హృతిక్ కూడా షూట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.

News October 22, 2024

త్వరలోనే విద్యార్థులకు గుడ్ న్యూస్: మంత్రి లోకేశ్

image

AP: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘వైసీపీ ప్రభుత్వం రూ.3,500 కోట్లు చెల్లించకుండా మోసం చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రివర్గం, ఉన్నతాధికారులతో చర్చిస్తున్నా. త్వరలోనే మీరు శుభవార్త వింటారని హామీ ఇస్తున్నా. నేను మీతోనే ఉన్నా’ అని ట్వీట్ చేశారు. రేపు క్యాబినెట్ భేటీలోనే నిధుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.