News October 21, 2024
గ్రూప్-1 మెయిన్స్.. మ.1.30 గంటల తర్వాత నో ఎంట్రీ

TG: అభ్యర్థుల ఆందోళనలు, ప్రభుత్వ పట్టుదల నడుమ మరికొన్ని గంటల్లో గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మ.12.30 నుంచి 1.30 గంటల వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చేవారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. పరీక్షలకు సంబంధించి అనుమానాలపై 040-23452185, 040-23452186 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Similar News
News February 6, 2026
421 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 421 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA/PGDM, CA/CFA/CMA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అప్లికేషన్ స్క్రూట్నీ, ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bankofbaroda.bank.in/
News February 6, 2026
KCR చిప్పకూడు తినకుండా అడ్డుకుంటోంది ఎవరు: రేవంత్

TG: రూ.లక్ష కోట్లతో కట్టిన ‘కాళేశ్వరం’ మూడేళ్లలో కూలిపోయిందని CM రేవంత్ విమర్శించారు. గోదావరి జలాల పేరుతో కల్వకుంట్ల కుటుంబం TGని దోచుకుందని ఆరోపించారు. BJPకి అధికారం ఇస్తే KCRను జైల్లో వేస్తామన్న కిషన్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. జైల్లో KCR చిప్పకూడు తినకుండా అడ్డుకుంటోంది ఎవరు? అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే ఎక్కువ నిధులు వస్తాయని NZB సభలో తెలిపారు.
News February 6, 2026
మాకు పాఠాలు చెప్పొద్దు.. ట్రంప్కు ‘నోబెల్’ ప్రతిపాదనపై పోలండ్

ట్రంప్ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయాలని US పంపిన ప్రతిపాదనలను పోలండ్ తిరస్కరించింది. అవార్డుకు ఆయన అర్హుడు కాదని పార్లమెంట్ స్పీకర్ జాజెస్టీ ప్రకటించారు. దీంతో ఇది ట్రంప్ను అవమానించడమేనని US దౌత్యవేత్త టామ్ రోజ్ విమర్శించారు. దీనికి పోలండ్ PM టస్క్ కౌంటరిచ్చారు. ‘అంబాసిడర్ రోజ్ మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి. అంతేకానీ పాఠాలు చెప్పొద్దు. దౌత్యం ఎలా నిర్వహించాలో మాకు తెలుసు’ అని పేర్కొన్నారు.


