News October 21, 2024

ప్రశాంతంగా ముగిసిన తొలిరోజు గ్రూప్-1 మెయిన్స్

image

TG: తొలిరోజు గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మ.2 గంటల నుంచి సా.5 వరకు పరీక్ష జరిగింది. జీవో 29ను రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లగా, ఎగ్జామ్స్ నిర్వహణకే అత్యున్నత న్యాయస్థానం మొగ్గు చూపింది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరిగాయి. ఈ నెల 27న ఎగ్జామ్స్ ముగియనున్నాయి.

Similar News

News December 1, 2025

కడప: 10 రోజుల్లో డెలివరీ.. అంతలోనే విషాదం.!

image

ఎన్నో ఆశలు.. ఆవిరైపోయాయి. మరో 10 రోజుల్లో కుటుంబంలోకి ఇంకొకరు చేరుతారని కలలుకన్నారు. కానీ ఆ కలల కన్నీళ్లను మిగిల్చాయి. ఈ విషాదకర ఘటన వేంపల్లిలోని పుల్లయ్య తోటలో చోటు చేసుకుంది. భూదేవి(27) అనే గర్భిణీ తన ఇంటి రెండో అంతస్తులో నుంచి కింద పడి మృతిచెందింది. అదే సమయంలో గర్భంలోని శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆ కుటుంబమే కాదు.. గ్రామస్థులు, ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

News December 1, 2025

మహాభారతంలో భాగమే భగవద్గీత

image

వ్యాసుడు రచించిన మహాభారతంలో ఓ భాగమే భగవద్గీత అనే విషయం చాలామందికి తిలిసే ఉంటుంది. భారత ఇతిహాసంలో భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలను భగవద్గీతగా చెబుతారు. ఇందులో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి మనం ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నేర్పుతాయి. బంధువులను చంపడానికి విముఖత చూపిన అర్జునుడిని ధర్మ మార్గాన్ని చూపడానికి, ధర్మాన్ని గెలిపించడానికి కృష్ణుడు గీతబోధ చేశాడు.

News December 1, 2025

750పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

పంజాబ్ నేషనల్ బ్యాంకులో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులైన 20-30 ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. రాత పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://pnb.bank.in/