News October 21, 2024
ప్రశాంతంగా ముగిసిన తొలిరోజు గ్రూప్-1 మెయిన్స్

TG: తొలిరోజు గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మ.2 గంటల నుంచి సా.5 వరకు పరీక్ష జరిగింది. జీవో 29ను రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లగా, ఎగ్జామ్స్ నిర్వహణకే అత్యున్నత న్యాయస్థానం మొగ్గు చూపింది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరిగాయి. ఈ నెల 27న ఎగ్జామ్స్ ముగియనున్నాయి.
Similar News
News November 5, 2025
ఆలయ పరిసరాల్లో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చా?

దేవాలయాల పరిసరాల్లో నివాసంపై వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ప్రత్యేక సూచన చేశారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. దేవాలయాల గోపురం నీడ పడనంత దూరం ఇల్లు ఉండాలని ఆయన అన్నారు. ‘ఆలయ శక్తి అధికంగా ఉంటుంది. ఆ గోపురం నీడ పడేంత సమీపంలో ఇల్లు ఉండడం సంసారిక సుఖానికి ఆటంకం కలిగిస్తుంది. గోపురం నీడలో నివాసం ఏర్పరచుకోవడం శాస్త్ర సమ్మతం కాదు. దైవత్వం పట్ల గౌరవం ఉంచుతూ, ఇంటికి సరైన దూరం పాటించాలి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>
News November 5, 2025
నవంబర్ 24 నుంచి పార్లమెంటు సమావేశాలు!

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ఉభయ సభలు ఈనెల 24 లేదా 25 నుంచి సమావేశం అవుతాయని పేర్కొన్నాయి. డిసెంబర్ 19 వరకు ఇవి కొనసాగుతాయని చెప్పాయి. కాగా EC చేపట్టిన దేశవ్యాప్త SIRను వ్యతిరేకిస్తూ ఓట్ చోరీ అంటూ విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు దీనిపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. US టారిఫ్స్పైనా ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.
News November 5, 2025
OFFICIAL: కమల్ ప్రొడక్షన్లో రజినీ సినిమా

తమిళ సినీ దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్ ఓ సినిమా కోసం చేతులు కలిపారు. కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో రజినీకాంత్ హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి సి.సుందర్ దర్శకత్వం వహించనున్నారు. సూపర్ స్టార్కు 173వ సినిమా ఇది. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు కమల్ హాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


