News March 10, 2025

గ్రూప్-1 ఫలితాలు విడుదల

image

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అభ్యర్థులు అధికారిక <>వెబ్‌సైట్‌లో <<>>ఫలితాలు తెలుసుకోవచ్చు. 563 పోస్టులకుగానూ గతేడాది జరిగిన మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అటు రేపు గ్రూప్-2 రిజల్ట్స్ రానున్నాయి.

Similar News

News December 20, 2025

ధనుర్మాసంలో శ్రీవారికి సుప్రభాత సేవ జరపరా?

image

సాధారణంగా ఏడాది పొడవునా తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. కానీ ధనుర్మాసంలో ఈ సేవకు బదులుగా ‘తిరుప్పావై’ పఠనం నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం వంటిది. అందుకే ఈ నెలలో శ్రీవారిని నిద్రలేపేందుకు గోదాదేవి రచించిన దివ్య ప్రబంధ పాశురాలను వినిపిస్తారు. ఫలితంగా ఈ నెల రోజులు సుప్రభాత సేవ ఏకాంతంగా కూడా జరగదు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 20, 2025

ఎలా మాట్లాడాలంటే?

image

ఇతరులతో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విషయాలను తీసుకురాకూడదంటున్నారు నిపుణులు. అలాగే ఏదైనా అంశాన్ని నిరూపించడానికి ఎక్కువ వాదించకూడదు. చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్పాలి. వివిధ అంశాల గురించి పైపైన టచ్‌ చేస్తూ చెప్పడం కంటే ఒక్క అంశాన్నే స్పష్టంగా వివరించడం మంచిది. చెప్పే సమయం కంటే, నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. కాబట్టి ఏ విషయాన్నైనా స్పష్టంగా, నాణ్యతతో తక్కువ సమయంలోనే చెప్పడానికి ప్రయత్నించాలి.

News December 20, 2025

మాట్లాడే విధానం ఎంతో కీలకం

image

ఏదైనా చర్చలో పాల్గొన్నప్పుడే మనిషి వ్యక్తిత్వం బయటపడుతుంటుంది. అందుకే ఉద్యోగ నియామకాల్లో గ్రూప్‌ డిస్కషన్లు పెడుతుంటారు. అలాంటప్పుడు తోటివారికి అవకాశం ఇవ్వకుండా మీరే మాట్లాడకూడదు. ఆలుమగల మధ్య కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు భాగస్వామికి అవకాశం ఇవ్వరు. చెప్పాలనుకున్నవి ప్రభావవంతంగా వివరిస్తూనే ఇతరులకు అవకాశం ఇవ్వాలి. దానివల్ల ఒకరి అభిప్రాయాలు మరొకరికి స్పష్టంగా తెలిసి చర్చ అర్థవంతంగా ముగుస్తుంది.