News May 24, 2024
గ్రూప్-2, 3 పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలి: నిరుద్యోగులు

TG: గ్రూప్-2, 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దం తర్వాత ఈ నోటిఫికేషన్లు వచ్చాయని.. గత ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలకే పరీక్షలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. TGPSCని ప్రక్షాళన చేసిన సమావేశంలో సీఎం రేవంత్ కూడా పోస్టుల సంఖ్యను పెంచుతామని చెప్పారని గుర్తుచేస్తున్నారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News December 14, 2025
AIIMS మంగళగిరి 76 పోస్టులకు నోటిఫికేషన్

<
News December 14, 2025
AIIMS మంగళగిరి మరో నోటిఫికేషన్ విడుదల

AIIMS మంగళగిరి 4 పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. కమ్యూనిటీ& ఫ్యామిలీ మెడిసిన్, మైక్రోబయాలజీ, ఫిజియాలజీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS, MSc, PhD ఉత్తీర్ణులైన వారు JAN 2వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. బేసిక్ పే రూ.56,100. JAN 9న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్సైట్: https://www.aiimsmangalagiri.edu.in
News December 14, 2025
BIG BREAKING: సంక్రాంతి స్పెషల్.. టికెట్లు విడుదల

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్. రద్దీ దృష్ట్యా JAN 8 నుంచి 20 వరకు నడిపే ప్రత్యేక రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. త్వరగా టికెట్లు అయిపోయే అవకాశం ఉన్నందున వెంటనే IRCTC వెబ్సైట్, యాప్లో రిజర్వేషన్ చేసుకోండి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా APలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు ఈ 41 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఆ జాబితా కోసం పైన ఫొటోలను స్వైప్ చేయండి.


