News May 24, 2024
గ్రూప్-2, 3 పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలి: నిరుద్యోగులు

TG: గ్రూప్-2, 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దం తర్వాత ఈ నోటిఫికేషన్లు వచ్చాయని.. గత ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలకే పరీక్షలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. TGPSCని ప్రక్షాళన చేసిన సమావేశంలో సీఎం రేవంత్ కూడా పోస్టుల సంఖ్యను పెంచుతామని చెప్పారని గుర్తుచేస్తున్నారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News December 11, 2025
పసిబిడ్డకు పన్నెండు గంటల నిద్ర కావాల్సిందే..

ఏడాదిలోపు పసిపిల్లలకు రోజుకి 12-16 గంటలు నిద్ర అవసరం. రెండేళ్ల లోపువారైతే 8-14 గంటలు నిద్ర ఉండాలంటున్నారు నిపుణులు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎదగాలన్నా, శారీరక ఎదుగుదల బావుండాలన్నా పసిపిల్లలు రోజులో సగభాగం నిద్రలో ఉంటేనే మంచిది. సరిపోయినంతగా నిద్ర ఉంటే, ఎదిగిన తర్వాత వారిలో ఆలోచనాశక్తి, సమస్యను పరిష్కరించే నైపుణ్యం, జ్ఞాపకశక్తితోపాటు మెరుగైన మానసికారోగ్యాన్ని పొందుతారని చెబుతున్నారు.
News December 11, 2025
పరిధి దాటారు, రేపు లొంగిపోండి: సుప్రీంకోర్టు

తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రేపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అధికారి ACP వెంకటగిరి ఎదుట 11AM లోపు లొంగిపోవాలని పేర్కొంది. SIB చీఫ్గా తన పరిధి దాటి వ్యవహరించారని వ్యాఖ్యానించింది. అటు బెయిల్ రద్దుతో పాటు, 14 రోజులు ఆయన్ను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ వేయగా, ఇంటరాగేషన్ అంశంపై శుక్రవారం విచారణ జరగనుంది.
News December 11, 2025
కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న BCCI

వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లీల శాలరీలను BCCI తగ్గించే అవకాశముంది. ఈనెల 22న బోర్డు వార్షిక కౌన్సిల్ భేటీలో ఇద్దర్నీ A+ కేటగిరీ నుంచి Aకు మారుస్తారని సమాచారం. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ Aనుంచి A+కు ప్రమోట్ కానున్నారు. అంపైర్స్, రిఫరీల రెమ్యునరేషన్ అంశాలపైనా ఇందులో చర్చ జరగనుంది. ప్లేయర్లకు A+, A, B, C కేటగిరీలుగా బోర్డు శాలరీలు ఇస్తోంది.
A+: ₹7కోట్లు, A: ₹5కోట్లు, B: ₹3కోట్లు, C: ₹1కోటి.


