News May 24, 2024

గ్రూప్-2, 3 పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలి: నిరుద్యోగులు

image

TG: గ్రూప్-2, 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దం తర్వాత ఈ నోటిఫికేషన్లు వచ్చాయని.. గత ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలకే పరీక్షలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. TGPSCని ప్రక్షాళన చేసిన సమావేశంలో సీఎం రేవంత్ కూడా పోస్టుల సంఖ్యను పెంచుతామని చెప్పారని గుర్తుచేస్తున్నారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News December 22, 2025

స్కాలర్‌షిప్ బకాయిలు రూ.365.75 కోట్లు విడుద‌ల‌

image

TG: బీసీ, ఎస్సీ, ట్రైబ‌ల్ వెల్ఫేర్ శాఖ‌ల‌కు సంబంధించిన రూ.365.75 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఎస్సీ సంక్షేమ శాఖ‌కు ₹191.63Cr, గిరిజన సంక్షేమ శాఖ‌కు ₹152.59Cr, బీసీ సంక్షేమ శాఖ‌కు ₹21.62Cr విడుద‌ల‌య్యాయి. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ పూర్తిగా విడుదల చేసినట్లు Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా విద్య విషయంలో రాజీ పడబోమన్నారు.

News December 22, 2025

పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలి: పవన్

image

AP: అమరజీవి పొట్టి శ్రీరాములుకు గౌరవం ఇవ్వాలంటే పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని Dy.CM పవన్ అభిప్రాయపడ్డారు. తన ఆలోచనపై అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. మహనీయుడు అంబేడ్కర్‌కు కూడా కులం ఆపాదించడం సరికాదన్నారు. ‘పదవి-బాధ్యత’ సమావేశంలో ఆయన మాట్లాడారు.

News December 22, 2025

ఐడియాలజీ సరైంది కాకుంటే ఇబ్బందులు: పవన్

image

AP: జనసేన కోసం పనిచేసిన వారందరినీ గుర్తించామని పార్టీ చీఫ్, Dy.CM పవన్ చెప్పారు. నామినేటెడ్ పదవులు పొందినవారితో మంగళగిరిలో మాట్లాడారు. ‘ఓడిపోయినా నిలబడినందుకే మీకు పదవులు వచ్చాయి. మీరంతా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. యువతకు సరైన వేదికగా నేను పార్టీ పెట్టా. అప్పట్లో కొత్త పంథాను నమ్ముకుని మావోలుగా మారి వేలాదిమంది చనిపోయారు. ఐడియాలజీ సరైంది కాకుంటే ఇలాంటి ఇబ్బందులొస్తాయి’ అని తెలిపారు.