News May 24, 2024
గ్రూప్-2, 3 పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలి: నిరుద్యోగులు

TG: గ్రూప్-2, 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దం తర్వాత ఈ నోటిఫికేషన్లు వచ్చాయని.. గత ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలకే పరీక్షలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. TGPSCని ప్రక్షాళన చేసిన సమావేశంలో సీఎం రేవంత్ కూడా పోస్టుల సంఖ్యను పెంచుతామని చెప్పారని గుర్తుచేస్తున్నారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News December 4, 2025
చనిపోయినట్లు నటించే బ్యాక్టీరియా!

అత్యంత అరుదైన బ్యాక్టీరియా(టెర్సికోకస్ ఫీనిసిస్)ను US సైంటిస్టులు కనుగొన్నారు. స్పేస్క్రాఫ్ట్ అసెంబ్లీ రూమ్స్ లాంటి భూమిపై ఉన్న అతి పరిశుభ్రమైన వాతావరణాలలోనూ ఇది జీవించగలదని తెలిపారు. ‘తన మనుగడను కొనసాగించడానికి చనిపోయినట్లు నటిస్తుంది. వీటిని గుర్తించడం, నాశనం చేయడం కష్టం. ఏదైనా బ్యాక్టీరియా వ్యాప్తి కట్టడికి కఠినమైన శుభ్రతా ప్రమాణాలు ఎందుకు పాటించాలో ఇలాంటివి నిరూపిస్తాయి’ అని పేర్కొన్నారు.
News December 4, 2025
మనసునూ పట్టించుకోవాలి: సారా అలీఖాన్

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలాముఖ్యమని బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ అంటున్నారు. భావోద్వేగాలను అణిచివేయడం బలం కాదు. వాటిని అంగీకరించే ధైర్యం కలిగి ఉండటం ముఖ్యం అంటున్నారు. ప్రస్తుత తరం మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టట్లేదు. శరీరానికి ఇచ్చే శ్రద్ధ మనసుకు కూడా ఇస్తేనే మనం బలంగా ఉన్నట్లు అర్థం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక శ్రేయస్సు గురించి కూడా చర్చించాలంటున్నారు.
News December 4, 2025
సల్మాన్ ఖాన్ రాక.. కీరవాణి రాగం

TG గ్లోబల్ సమ్మిట్కు సినీ గ్లామర్ తోడవనుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సదస్సుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. సినీ ఇండస్ట్రీపై చర్చలో ఆయన పాల్గొంటారు. అటు ఈవెంట్ మొదట్లో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి కన్సర్ట్ ఉండనుంది. సుమారు గంటన్నరపాటు ఆయన తన సంగీతంతో ఆకట్టుకోనున్నారు. బంజారా, కోలాటం, గుస్సాడీ, భారతనాట్యం వంటి కల్చరల్ ప్రోగ్రామ్లు అతిథులను అలరించనున్నాయి.


