News February 23, 2025

ముగిసిన గ్రూప్-2 ఎగ్జామ్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించారు. మొత్తం 175 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై కాగా 79,599 మంది పరీక్షలు రాశారు. వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు, ప్రభుత్వం కోరినా APPSC వెనక్కి తగ్గకుండా నిర్వహించింది. మరి మీరు ఈ ఎగ్జామ్ రాశారా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? కామెంట్ చేయండి.

Similar News

News January 28, 2026

కేరళ బస్సు వివాదం.. షింజితా ముస్తఫా బెయిల్ పిటిషన్ తిరస్కరణ

image

కేరళలోని ఓ బస్సులో దీపక్‌ అనే వ్యక్తిపై లైంగిక ఆరోపణలు చేసి అతని <<18917671>>ఆత్మహత్యకు<<>> కారణమైన షింజితా ముస్తఫాకు కోజికోడ్ కోర్టు షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రస్తుతం సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీడియోను అప్‌లోడ్ చేసిన ఫోన్‌ను సైంటిఫిక్ అనాలసిస్‌కు పంపామన్నారు. ఈ దశలో ఆమెను విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది.

News January 28, 2026

నేడు..

image

☕AP క్యాబినెట్ భేటీ
☕ఢిల్లీలో కేంద్రమంత్రులతో AP డిప్యూటీ సీఎం పవన్ భేటీ
☕భీమవరం ముఖ్య నేతలతో జగన్ సమావేశం
☕అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం
☕మేడారం జాతర షురూ.. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు
☕మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలు
☕మెదక్ జిల్లాలో మీనాక్షి, మహేశ్ గౌడ్ పర్యటన
☕ఢిల్లీలో NCC ర్యాలీ, పాల్గొననున్న ప్రధాని
☕వైజాగ్‌లో భారత్-న్యూజిలాండ్ నాలుగో T20

News January 28, 2026

బాయ్‌కాట్ లీకులు.. పాక్‌కు భారీ షాక్ తప్పదా?

image

T20WCలో ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ పీసీబీ ఛైర్మన్ నఖ్వీ లీకులు ఇస్తున్నారు. అయితే ఇదే జరిగితే ఆ దేశంపై $38 మిలియన్ల దావా వేసేందుకు బ్రాడ్‌కాస్టర్ సిద్ధమవుతోంది. ఎంతో క్రేజ్ ఉండే INDvsPAK మ్యాచ్ కోసం ఇప్పటికే భారీగా అడ్వర్‌టైజింగ్ స్లాట్లు, స్పాన్సర్‌షిప్స్ బుక్కయ్యాయి. ఒకవేళ బాయ్‌కాట్ ప్రకటన వస్తే నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని బ్రాడ్‌కాస్టర్ వర్గాలు పేర్కొన్నాయి.