News February 23, 2025

ముగిసిన గ్రూప్-2 ఎగ్జామ్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించారు. మొత్తం 175 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై కాగా 79,599 మంది పరీక్షలు రాశారు. వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు, ప్రభుత్వం కోరినా APPSC వెనక్కి తగ్గకుండా నిర్వహించింది. మరి మీరు ఈ ఎగ్జామ్ రాశారా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? కామెంట్ చేయండి.

Similar News

News January 28, 2026

ఉక్రెయిన్-రష్యా వార్.. 20L సైనికుల లాస్

image

నాలుగేళ్లుగా కొనసాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైనిక నష్టం జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 20L మంది మరణించడం లేదా గాయపడటం/బందీలవడం/మిస్సయినట్లు US థింక్ ట్యాంక్ వెల్లడించింది. ఇందులో మాస్కో ఫోర్స్ 12L, ఉక్రెయిన్ దళాలు 8L వరకు ఉన్నట్లు తెలిపింది. అయితే ఇరు దేశాలు ఈ సంఖ్యను భారీగా తగ్గించి చెబుతుండటం గమనార్హం. అదే సమయంలో దాదాపు 15వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు UN చెబుతోంది.

News January 28, 2026

మామిడిలో తేనె మంచు పురుగు, బూడిద తెగులు నివారణ ఎలా?

image

మామిడి పూమొగ్గ, లేత పూత దశలో తేనే మంచు పురుగు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు పూత ప్రారంభదశలో మొగ్గలుగా ఉన్నపుడే నివారణ చర్యలు చేపట్టాలి. లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.5ml లేదా బ్యూప్రొపెజిన్ 2ml మందులలో ఒకదానితో పాటు లీటరు నీటికి వెట్టబుల్ సల్ఫర్ 3గ్రా. లేదా లీటరు నీటికి మైక్లోబుటానిల్ 1గ్రా. మరియు బోరాన్ లీటరు నీటికి 1గ్రా. లేదా 2గ్రా. కలిపి స్ప్రే చేసి చీడలను నివారించవచ్చు.

News January 28, 2026

విష్ణు సహస్ర నామం ఎలా ఆవిర్భవించిందంటే..?

image

కురుక్షేత్రం ముగిశాక అంపశయ్యపై భీష్ముడు తన విశిష్టతను చాటుకున్నాడు. తనను దర్శించడానికి వచ్చిన ధర్మరాజుకు రాజనీతి సూత్రాలు, జీవన ధర్మాలు బోధించాడు. కృష్ణుడిని స్తుతిస్తూ పవిత్ర ‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ లోకానికి అందించాడు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి, మరణ సమయాన్ని సైతం తన ఆధీనంలో ఉంచుకున్న ఈ వృద్ధ పితామహుడు ధర్మ స్థాపన కోసం తన జ్ఞానాన్ని పాండవులకు ధారపోసి ధన్యుడయ్యడు.