News February 23, 2025
ముగిసిన గ్రూప్-2 ఎగ్జామ్

AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించారు. మొత్తం 175 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 92,250 మంది మెయిన్స్కు క్వాలిఫై కాగా 79,599 మంది పరీక్షలు రాశారు. వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు, ప్రభుత్వం కోరినా APPSC వెనక్కి తగ్గకుండా నిర్వహించింది. మరి మీరు ఈ ఎగ్జామ్ రాశారా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? కామెంట్ చేయండి.
Similar News
News December 25, 2025
పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

ప్రొటీన్లు ఉండే పప్పులు చిన్నారులకు ఎక్కువగా ఇవ్వడం వల్ల అజీర్తి, జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. డ్రైఫ్రూట్స్ వంటివి 8,9 నెలల సమయంలో కొద్దిమొత్తంలో యాడ్ చేస్తే సరిపోతుందంటున్నారు. వీటితో పాటు రాగిజావ, యాపిల్, అరటిపండు వంటి వాటిని గుజ్జు చేసి పెట్టచ్చు. కాకపోతే అన్నీ ఒకేసారి కాకుండా పదిహేనురోజుల గ్యాప్ తీసుకొని పిల్లలకు అలవాటు చెయ్యడం మంచిదని సూచిస్తున్నారు.
News December 25, 2025
తూర్పు గోదావరి జిల్లాలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP: రాజమహేంద్రవరంలోని GMC, GGHలో 60పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు DEC 26 నుంచి JAN 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా( అనస్థీషియా టెక్నీషియన్, కార్డియాలజీ, ECG), BSc, DMLT, BSc(MLT), ఇంటర్(ఒకేషనల్), CLISc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: eastgodavari.ap.gov.in
News December 25, 2025
ఓ వెబ్ సిరీస్.. 8 వేల ఉద్యోగాలు, $1.4 బిలియన్లు!

పేరుకు తగ్గట్టే ‘Stranger Things’ సిరీస్ సంచలనాలు సృష్టిస్తోంది. ప్రేక్షకులను అలరిస్తూనే 2016 నుంచి ఇప్పటిదాకా $1.4B మేర అమెరికా GDPకి దోహదపడింది. 8 వేల జాబ్స్ కల్పించింది. ఆ సిరీస్లో చూపిన ప్రదేశాలకు పర్యాటకులు పోటెత్తడంతో టూరిజం ఆదాయం భారీగా వచ్చింది. అందులో కనిపించిన ఫుడ్ ఐటమ్స్, బొమ్మలు, వీడియో గేమ్స్, పాటలకూ డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ సిరీస్ 120 కోట్ల <<18400629>>వ్యూస్<<>> సాధించింది.


