News February 23, 2025
ముగిసిన గ్రూప్-2 ఎగ్జామ్

AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించారు. మొత్తం 175 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 92,250 మంది మెయిన్స్కు క్వాలిఫై కాగా 79,599 మంది పరీక్షలు రాశారు. వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు, ప్రభుత్వం కోరినా APPSC వెనక్కి తగ్గకుండా నిర్వహించింది. మరి మీరు ఈ ఎగ్జామ్ రాశారా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? కామెంట్ చేయండి.
Similar News
News January 22, 2026
ఈ ఫుడ్స్ తింటే పదేళ్లు యంగ్గా కనిపిస్తారు

చర్మానికి లోపలి నుంచి పోషణ అందిస్తే ఎక్కువ కాలం యంగ్గా కనిపించొచ్చని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. ఉసిరికాయల్లో ఉండే కొల్లాజెన్ స్కిన్ను ముడతలు పడకుండా, సాగిపోకుండా కాపాడుతుంది. దానిమ్మగింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ ప్రాబ్లమ్స్ను దూరం చేస్తాయి. వాల్నట్స్లో ఉండే విటమిన్ ఈ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ను యవ్వనంగా మారుస్తాయి. రోజూ 4-5 నానబెట్టిన బాదంపప్పులు తింటే చర్మం మెరుస్తుంది.
News January 22, 2026
గులాబీ తోటలను ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి?

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.
News January 22, 2026
నలుపు రంగును అశుభంగా ఎందుకు భావిస్తారు?

మన ధర్మశాస్త్రాల ప్రకారం.. నలుపు రంగును చీకటి, శూన్యం, అజ్ఞానానికి చిహ్నంగా పరిగణిస్తారు. అలాగే ఇది శని గ్రహానికి కూడా సంకేతం. కష్టాలను, మందగమనాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అలాగే నలుపు కిరణాలను పీల్చుకుంటుంది. కానీ తిరిగి ప్రసరించదు. అందుకే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని శుభకార్యాల్లో నివారిస్తారు. అయితే, దిష్టి తగలకుండా నలుపు చుక్క, దారం వాడుతారు. ఇలా ఈ రంగు రక్షణకు చిహ్నంగా ఉపయోగపడుతుంది.


