News February 23, 2025

ముగిసిన గ్రూప్-2 ఎగ్జామ్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించారు. మొత్తం 175 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై కాగా 79,599 మంది పరీక్షలు రాశారు. వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు, ప్రభుత్వం కోరినా APPSC వెనక్కి తగ్గకుండా నిర్వహించింది. మరి మీరు ఈ ఎగ్జామ్ రాశారా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? కామెంట్ చేయండి.

Similar News

News January 31, 2026

ఒకే ఓవర్‌లో 4, 4, 4, 6, 4, 6

image

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న ఐదో టీ20లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించారు. ఇష్ సోదీ వేసిన 12వ ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 6, 4, 6 బాదారు. వైడ్‌తో కలిసి మొత్తం 29 రన్స్ వచ్చాయి.

News January 31, 2026

20 ఏళ్లలోపే స్మోకింగ్‌తో స్ట్రోక్ ముప్పు

image

స్మోకింగ్‌కు, వయసుకు సంబంధం ఉందని దక్షిణకొరియా అధ్యయనంలో వెల్లడైంది. 20 ఏళ్లలోపే స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి స్ట్రోక్ ముప్పు 70-80% ఎక్కువగా ఉందని, మధ్యలో స్మోకింగ్ మానేసినా రిస్క్ అలాగే ఉంటుందని తేలింది. ‘20 ఏళ్ల వయసులో శరీరం అభివృద్ధి చెందే దశలోనే ఉంటుంది. స్మోకింగ్ వల్ల విష పదార్థాలు మెదడు, రక్తనాళాలు, గుండె వ్యవస్థలపై శాశ్వత ప్రభావం చూపిస్తాయి’ అని సైంటిస్టులు పేర్కొంటున్నారు. SO BE CAREFUL

News January 31, 2026

భారత్‌పై సుంకాలు.. ట్రంప్ మూర్ఖత్వానికి నిదర్శనం:US రిటైర్డ్ కల్నల్

image

IND-US మధ్య వాణిజ్య చర్చలపై అమెరికా రిటైర్డ్ కల్నల్ డగ్లస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా చెప్పిన ప్రతి అంశానికీ ఇండియా ఓకే చెప్పదన్నారు. సొంత ప్రయోజనాలకు రాజీపడి ఏ దేశమూ ఇతర దేశాలకు తలొగ్గదని పేర్కొన్నారు. రష్యాతో బిజినెస్ చేస్తున్న దేశాలపై అధిక సుంకాలను విధించడం ట్రంప్ మూర్ఖపు మనస్తత్వానికి నిదర్శనమని అభివర్ణించారు. ఇలాంటి పనుల వల్ల USకే నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.