News November 26, 2024

యథాతథంగా గ్రూప్-2 పరీక్షలు: టీజీపీఎస్సీ

image

TG: వచ్చే నెల 15, 16న జరిగే గ్రూప్-2 ఎగ్జామ్స్‌లో ఎలాంటి మార్పు లేదని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. DEC 16న జరిగే RRB పరీక్షను రాష్ట్రం నుంచి డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్న 6,300 మంది రాస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గ్రూప్-2 పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండబోదని వివరించారు.

Similar News

News October 14, 2025

మీ స్కిన్‌టైప్ ఇలా తెలుసుకోండి

image

మన చర్మతత్వాన్ని బట్టి ఉత్పత్తులు ఎంచుకోవాలి. లేదంటే ఎన్ని కాస్మెటిక్స్ వాడినా ఉపయోగం ఉండదు. మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలంటే చర్మంపై వివిధ ప్రాంతాల్లో బ్లాటింగ్ పేపర్‌ను పెట్టాలి. తర్వాత ఆ షీట్‌ను వెలుతురులో చెక్ చేయాలి. ఆయిల్ కనిపించకపోతే మీది పొడి చర్మం, నుదురు, ముక్కు దగ్గర ఆయిల్ ఉంటే మీ చర్మం డ్రై, ఆయిల్ కాంబినేషన్ స్కిన్ అని, పేపర్ పూర్తి ఆయిల్‌గా కనిపిస్తుంటే ఆయిలీ స్కిన్ అని అర్థం.

News October 14, 2025

హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

బిహార్‌లోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్& సెంటర్‌ వివిధ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, ఇంటర్, సబ్ ఫైర్ ఆఫీసర్ కోర్సు అర్హతతో 14 పంప్ ఆపరేటర్, ఫైర్‌మెన్, సబ్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు ఈనెల 24న ఇంటర్వ్యూ నిర్వహించనుంది. 2ఫోర్‌మెన్, 1టెక్నీషియన్ పోస్టులకు NOV 4న, నర్సు, డిస్ట్రిక్ టెక్నికల్ ఆఫీసర్, తదితర పోస్టులకు NOV 14న ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది.

News October 14, 2025

WCలో RO-KO ఆడతారా.. గంభీర్ ఆన్సర్ ఇదే!

image

దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడే విషయమై తాను గ్యారంటీ ఇవ్వలేనని టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ చెప్పారు. అది వారి ఫిట్‌నెస్‌తో పాటు స్థిరమైన ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాబోయే ఆస్ట్రేలియా టూర్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్టులు, T20Iలకు వీడ్కోలు చెప్పిన రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.