News March 30, 2024

త్వరలో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు

image

AP: గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై APPSC సభ్యుడు పరిగె సుధీర్ కీలక అప్డేడ్ ఇచ్చారు. త్వరలో గ్రూప్-2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదలవుతాయని వెల్లడించారు. ఫిబ్రవరి 25న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 4 లక్షల మంది హాజరయ్యారు.

Similar News

News October 5, 2024

అరుదైన రికార్డు ముంగిట హార్దిక్

image

బంగ్లాతో T20 సిరీస్ ముంగిట భారత పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్‌ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటి వరకు T20ల్లో 86 వికెట్లు తీసిన పాండ్య మరో 5 తీస్తే ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్‌గా నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు భువనేశ్వర్(90) పేరిట ఉంది. మొత్తంగా చూసుకుంటే స్పిన్నర్ చాహల్ 96 వికెట్లతో టాప్‌లో ఉన్నారు. బుమ్రా 86 వికెట్లు తీసినప్పటికీ అతడు బంగ్లాతో సిరీస్ ఆడటం లేదు.

News October 5, 2024

ఫొటో గ్యాలరీ.. హంసవాహనంపై తిరుమలేశుడు

image

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ వేంకటేశ్వరుడు హంసవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరించారు. సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కనులపండువగా సాగిన మహోత్సవ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News October 5, 2024

బంగ్లాతో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ

image

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన రేపటి నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దూబే స్థానంలో హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. త్వరలోనే తిలక్ జట్టుతో కలుస్తారని తెలుస్తోంది. కాగా రేపు రాత్రి 7.30 గంటలకు గ్వాలియర్‌లో భారత్, బంగ్లా మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది.