News November 19, 2024

ఈనెల 26న గ్రూప్-4 నియామక పత్రాల అందజేత?

image

TG: గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఈనెల 26న నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఈనెల 14న గ్రూప్-4 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయగా, 8084 మంది ఎంపికైన సంగతి తెలిసిందే.

Similar News

News November 27, 2025

అమరావతిలో ఏర్పాటు కానున్న కాస్మోస్ ప్లానిటోరియం

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అమరావతిలో ప్లానిటోరియం ఏర్పాటు చేయనుంది. రాజధానిలో కాస్మోస్ ప్లానిటోరియం ఏర్పాటుకై CRDA అధికారులతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఎంఓయూ చేసుకోనుంది. ఈ నెల 28న అమరావతిలో బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణ పనుల శంకుస్థాపన జరగనున్న సందర్భంగా ఈ ఎంఓయూ జరగనున్నట్లు CRDA కమిషనర్ కె. కన్నబాబు ఐఏఎస్ ఓ ప్రకటన విడుదల చేశారు.

News November 27, 2025

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు.. రేపు విచారణ
*SAతో టెస్ట్ సిరీస్‌లో IND ఘోర ఓటమి.. 2-0తో వైట్‌వాష్
*AP: మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే: పవన్ కళ్యాణ్‌
*రేవంత్ రూ.50వేల కోట్ల పవర్ స్కాం: హరీశ్‌
*APలో స్టూడెంట్ అసెంబ్లీ.. ప్రశ్నలు, వివరణలతో ఆకట్టుకున్నవిద్యార్థులు
*బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రేపటికి వాయుగుండంగా మారవచ్చన్న APSDMA

News November 27, 2025

కుళ్లిన పండ్లను తీసుకుని.. : అంధుల క్రికెట్ కెప్టెన్ కన్నీళ్లు

image

మహిళల అంధుల క్రికెట్ <<18367663>>ప్రపంచకప్‌ను<<>> ఇటీవల ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కెప్టెన్ దీపిక ఎమోషనల్ అయ్యారు. ‘జనం విసిరేసే కుళ్లిన పండ్లలో చెడు భాగాన్ని తీసేసి మిగతాది నేను, నా తోబుట్టువులు తినేవాళ్లం. మా ఇంట్లోనే కాదు ప్రతి ప్లేయర్‌ ఇంట్లో రోజుకు ఒకపూట భోజనం దొరకడం కూడా కష్టం. ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.