News November 14, 2024

గ్రూప్-4 ఫలితాలు విడుదల

image

TG: గ్రూప్-4 ఫలితాలు వెల్లడయ్యాయి. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ లిస్టును TGPSC సైట్‌లో పొందుపర్చారు. ఈ బటన్ <>క్లిక్<<>> చేసి ఫలితాలు చూసుకోండి. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి 2023 జులైలో పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. తాజాగా తుది ఫలితాలను రిలీజ్ చేశారు.

Similar News

News November 16, 2025

సిరిసిల్ల: రబీలో లక్ష 94 వేల ఎకరాల్లో పంట సాగుకు అంచనా

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రబీ సీజన్ (యాసంగి)లో సుమారు లక్ష 94 వేల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో 1,83,000 ఎకరాల్లో వరి సాగుకు, 11 వేల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు తదితర పంటల సాగుకు ప్రణాళిక రూపొందించిన అధికారులు ఇందుకు గాను 45,312 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేశారు.

News November 16, 2025

టెస్టుకు దూరమైన గిల్

image

టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన పాల్గొనరని BCCI వెల్లడించింది. రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ గిల్ మెడనొప్పితో మైదానాన్ని వీడారు. అటు ఇవాళ మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా స్కోర్ 93/7గా ఉంది.

News November 16, 2025

తిరుమలలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా?

image

స్వామివారి పుష్కరిణికి వాయువ్యంలో ఉన్న వరాహస్వామి ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి. పురాణాల ప్రకారం.. విష్ణుమూర్తి వరాహావతారంలో భూమిని పైకెత్తారు. ఆయన అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో వెలిశారు. అందుకే, తిరుమలలో తనను దర్శించుకునే భక్తులందరూ ముందుగా భూవరాహస్వామిని దర్శించుకుంటారని శ్రీనివాసుడు చెప్పారు. ఇప్పటికీ శ్రీవారి దర్శనానికన్నా ముందు దర్శనం, నైవేద్యం వరాహస్వామికే సమర్పిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>