News August 2, 2024
విజయవాడ, HYDలో జీఎస్టీ అప్పిలేట్ బెంచ్లు

దేశంలోని 36 రాష్ట్రాలు/UTలలో 31 జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ బెంచ్లను ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఏపీలో విజయవాడ కేంద్రంగా బెంచ్, విశాఖలో సర్క్యూట్ బెంచ్ ఉండనుంది. తెలంగాణకు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారు. గోవా, మహారాష్ట్రకు 3, యూపీకి 3, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్లకు రెండు చొప్పున, మిగిలిన రాష్ట్రాలకు ఒక్కో బెంచ్ ఉంటుంది.
Similar News
News January 7, 2026
ఎంజీఎంలో పని చేయని ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్!

వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎంకేర్ పథకం కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పని చేయడం లేదు. గంటకు 1000 కిలోల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల ఈ ప్లాంట్ల ఆక్సిజన్ రోగులకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రి, సీకేఎం, జీఎంహెచ్, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని ప్లాంట్లు పని చేయక ప్రైవేట్గా ఆక్సిజన్ కొనుగోలుకు నెలకు రూ.లక్షల భారం పడుతోంది.
News January 7, 2026
HYDకు 240 బస్సులేనా.. ఇదేం ప్లానింగ్?

AP: సంక్రాంతి సందర్భంగా 8,432 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే పండుగకు ముందు హైదరాబాద్కు 240 బస్సులే కేటాయించడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి పండుగకు లక్షలాది మంది ఏపీకి వస్తారని, ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీ ఉంటుందనే విషయం తెలిసీ ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అదనపు బస్సులను పెంచాలని కోరుతున్నారు. మీరేమంటారు?
News January 7, 2026
మొక్కజొన్నతో పాటు మిరప సాగు.. చైనా రైతుల వినూత్న ఆలోచన

చైనాలో రైతులు మొక్కజొన్న తోటల్లోని పొత్తుల్లో గింజలు రావడం మొదలవ్వగానే ఆకులను తొలగించి వాటి కింద మిరప మొక్కలను నాటుతుంటారు. మొక్కజొన్న పంట పూర్తవ్వగానే కాడలను వేళ్లతో సహా పీకేయకుండా సగం వరకు కత్తిరిస్తారు. దీని వల్ల అవి మిరప మొక్కలకు సహజ ఊతకర్రలుగా ఉండి, గాలులకు అవి పడకుండా రక్షణగా ఉంటాయి. ఇలా వారు ఒకేసారి రెండు పంటలను పండించి మంచి ఆదాయం పొందుతారు. దీన్నే ఇంటర్ క్రాపింగ్, realy క్రాపింగ్ అంటారు.


