News September 1, 2024
ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు ₹1.75 లక్షల కోట్లు

గతేడాది ఆగస్టులో ₹1.59 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదవగా, ఈ ఏడాది అదే నెలలో ₹1.75 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తంగా 10% వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ₹9.13 లక్షల కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఆగస్టులో డొమెస్టిక్ రెవెన్యూ 9.2% వృద్ధితో ₹1.25 లక్షల కోట్లు, దిగుమతుల ద్వారా 12.1% వృద్ధితో ₹49,976 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది.
Similar News
News December 7, 2025
20 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు ఈ టెస్టులు చేయించుకోవాలి

20 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే మహిళలు 20 ఏళ్ల తర్వాత కొన్ని పరీక్షలు తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. HPV టెస్ట్, STD టెస్ట్, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. అలాగే ఎప్పటికప్పుడు నెలసరిని వస్తుందా.. లేదా.. ఏవైనా హార్మోన్ సమస్యలున్నాయా అన్నవీ చెక్ చేసుకోవాలి. వీటితో పాటు హెల్తీ పుడ్, వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
News December 7, 2025
2,757 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 2,757 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BA, B.com, BSc, డిప్లొమా, టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల వారు DEC18 వరకు NAPS/NATS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18- 24ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iocl.com *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 7, 2025
ఏపీలో 13, తెలంగాణలో 21న లోక్ అదాలత్

TG: వివాదాలు, కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకునేందుకు డిసెంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ వెల్లడించింది. సివిల్, చెక్ బౌన్స్, వివాహ సంబంధ వివాదాలు, రాజీపడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే ట్రాఫిక్ చలాన్ల సెటిల్మెంట్ ఉండదని స్పష్టం చేశారు. అటు ఏపీలో ఈ నెల 13న లోక్ అదాలత్ జరగనుంది.


