News November 1, 2024

GST Collections: అక్టోబర్‌లో భారీగా వసూళ్లు

image

Oct జీఎస్టీ వ‌సూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.87 ల‌క్ష‌ల కోట్లుగా న‌మోద‌య్యాయి. గ‌త ఏడాది ఇదే నెల‌తో పోలిస్తే 9 శాతం వృద్ధి న‌మోదైంది. ఈ మొత్తంలో ఎస్జీఎస్టీ రూ.41 వేల కోట్లు, సీజీఎస్టీ రూ.33 వేల కోట్లు, ఐజీఎస్టీ ద్వారా రూ.99 వేల కోట్లు స‌మ‌కూరాయి. సెస్సుల రూపంలో మ‌రో రూ.12 వేల కోట్లు వ‌సూల‌య్యాయి. ఈ వృద్ధి పండుగ సీజన్‌లో అమ్మకాలు, పన్ను చెల్లింపుల వల్లే సాధ్యమైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Similar News

News December 5, 2025

మొదటి విడత.. 461 సర్పంచ్, 1,954 వార్డు స్థానాలకు పోటీ

image

జగిత్యాల జిల్లాలో ఈనెల 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 7 మండలాల్లోని మొత్తం 122 సర్పంచ్, 1,172 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 122 సర్పంచి స్థానాలకు గాను మొత్తం 461 మంది, అలాగే 1,172 వార్డు స్థానాలకు గాను మొత్తం 1,954 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా ఈనెల 11న జరిగే మొదటి విడత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

News December 5, 2025

PHOTO GALLERY: మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

image

AP: రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతంగా ముగిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ఫొటోలు దిగారు. అటు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

News December 5, 2025

పండ్లు, కూరగాయలు తినే ముందు ఇది గుర్తుంచుకోండి

image

వ్యవసాయంలో అధిక దిగుబడి, చీడపీడల నివారణ కోసం ఈ మధ్యకాలంలో పంటలపై క్రిమిసంహారకాలు, కలుపు మందుల వాడకం ఎక్కువైంది. పంటకాలం పూర్తై, విక్రయించిన తర్వాత కూడా పురుగు మందుల అవశేషాలు పండ్లు, కూరగాయల నుంచి తొలగిపోవు. అందుకే మనం తినే ముందు వీటిని తప్పనిసరిగా శుభ్రం చేసి తినాలి. లేకుంటే ఈ అవశేషాలు ఎక్కువ కాలం శరీరంలోకి చేరితే క్యాన్సర్, గుండె జబ్బులు, అంగ వైకల్యం లాంటి సమస్యలు తలెత్తే ఛాన్సుంది.