News April 1, 2025

మార్చిలో GST వసూళ్లు ₹1.96L Cr

image

జీఎస్టీ వసూళ్లలో మరోసారి వృద్ధి నమోదైంది. గతేడాది మార్చితో పోలిస్తే ఈ సారి 9.9% పెరిగి ₹1.96L Cr వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో CGST ₹38,100Cr, SGST ₹49,900Cr, IGST ₹95,900Cr, సెస్సులు ₹12,300Cr వసూలైనట్లు పేర్కొంది. రిఫండ్స్ రూపంలో ₹19,615Cr చెల్లించగా, నికరంగా ₹1.76L Cr వచ్చినట్లు తెలిపింది. FY2025లో మొత్తంగా ₹19.56L Cr వసూలైనట్లు(8.6% వృద్ధి) వివరించింది.

Similar News

News November 21, 2025

పల్నాడు: వీరాచారవంతులు అంటే ఎవరో తెలుసా.?

image

900 సంవత్సరాల పల్నాడు చరిత్ర, సంస్కృతిని కాపాడుతూ, నాటి సంస్కృతి గొప్పతనాన్ని నేటికీ ప్రచారం చేస్తున్నవారే వీరాచారవంతులు. వీరుల ఉత్సవాల సందర్భంగా దేశ నలుమూలన ఉన్న వీరాచారవంతులు కారంపూడికి వస్తారు. బ్రహ్మనాయుడు వారసులుగా ఉన్న పిడుగు వంశస్థులు వీర పీఠాన్ని నిర్వహిస్తున్నారు. వీరుల గాథలను, ఆయుధాల పరిరక్షణను, ఉత్సవాల నిర్వహణను వారసత్వంగా కొనసాగిస్తూ పల్నాటి చరిత్ర సంస్కృతిని నేటికీ నిలబెడుతున్నారు.

News November 21, 2025

పిల్లల వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారా?

image

వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల పిల్లలకు వ్యాధుల నుంచి రక్షణే కాక Herd Immunityని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏఏ టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపు ,ఆసుపత్రి ఖర్చుల తగ్గింపు, ఆరోగ్యకరమైన భవిష్యత్తు లభిస్తాయి. కాబట్టి పిల్లల టీకాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.

News November 21, 2025

గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 33 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ సిటీలో గురువారం జరిగిన దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. OCT 11న సీజ్‌ఫైర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి Israel దాడుల్లో కనీసం 211 మంది చనిపోయారని, 597 మంది గాయపడ్డారని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల ఎలాంటి మార్పూ రాలేదని, దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పాలస్తీనియన్లు ఆవేదన చెందుతున్నారు.